
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,20 ఏప్రిల్ 2022 : విజయవం తంగా తమ భాగస్వామ్యం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హువే ఇండియా,అక్షయపాత్ర ఫౌండేషన్లు తమ సమ్మిళిత పోరాటాన్ని ఆకలి, పౌష్టికాహార లోపం పై కొనసాగిస్తూ 9130 ఫ్యామిలీ హ్యాపినెస్ కిట్లను పంపిణీ చేసింది. ప్రతి కిట్లో నూ ప్రాంతీయ ఆహార అలవాట్లుకు తగినట్లుగా పదార్థాలు ఉంటాయి. ఇవి ఓ కుటుం బానికి 120 భోజనాలను అందించగలదు.అక్షయపాత్ర,హువేలు 2016లో భాగస్వా మ్యం ఏర్పరుచుకున్నాయి.
మధ్యాహ్న భోజన కార్యక్రమానికి మద్దతు నందించడంతో పాటుగా మహమ్మారి రెండేళ్ల కాలంలో నిరుపేదలకు డ్రై రేషన్ కిట్స్ను సైతం అందించింది.ఇప్పటి వరకూ 73.9 లక్షల భోజనాలను ఢిల్లీ ఎన్సీఆర్, ఉత్తర ప్రదేశ్, కర్నాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా అందించింది. ఈ భాగస్వామ్యం గురించి అక్షయపాత్ర ఫౌండేషన్ సీఈఓ శ్రీధర్ వెంకట్ మాట్లాడుతూ ‘‘సమాజ అభివృద్ధికి సమ్మిళిత ప్రయత్నాలు ఎంతగానో తోడ్పడతాయని మా గట్టి నమ్మిక. గత కొద్ది సంవత్సరాలుగా అక్షయపాత్ర ,కార్యక్రమాల ద్వారా పలు వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఏర్పడ్డాయి. అలాంటి భాగస్వా మ్యాలలో ఒకటి హువే ఇండియా భాగస్వామ్యం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం అందించడం ద్వారా తరగతి ఆకలి నిర్మూలించాలనే లక్ష్యంకు అనుగుణంగా మా భాగస్వామ్యం ఏర్పడింది.

హువే ఇండియాతో మా భాగస్వామ్యం మరింతగా వృద్ధి చెందడంతో పాటుగా మరిన్ని జీవితాలపై సానుకూల ప్రభావం చూపగలవని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.ఈ సందర్భంగా హువే ఇండియా సీఈవో డేవిడ్ లీ మాట్లాడుతూ ‘‘బాధ్యతాయుతమైన కార్పోరేట్ పౌరునిగా, స్థిరంగా సమాజం అభివృద్ధి చెందడారికి హువే కట్టుబడి ఉంది. అక్షయపాత్ర ఫౌండేషన్తో మా ఆరు సంవత్సరాల భాగస్వామ్యం తో చిన్నారులలో పౌష్టికాహార లోపం తొలగించడంతో పాటుగా తరగతి ఆకలిని సైతం నిర్మూలించడా నికి కృషి చేస్తుంది.భారతదేశంలో మా కార్పోరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలను మరింతగా విస్తరిస్తున్నాము. వీటి ద్వారా భారతీయ సమాజం, పరిశ్రమ లబ్ధి పొందగ లదు’’ అని అన్నారు.