365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 6,2022: అనసూయ భరద్వాజ్ 37 ఏళ్ల భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు పరిశ్రమలో ప్రముఖ నటి, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించారు. ఆమె వయస్సు 37 ఏళ్లు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ప్పటికీ ఆమె అందం, మధురంగా మాట్లాడటం ఆమె సొంతం.

నటిగా ప్రెజెంటర్,యాంకర్గా యువ తరంతో పోటీ పడుతున్న ఆమె ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారామే. ఆమె 2008లో తన ఎంబీఏ పూర్తి చేసి, కొంతకాలం హెచ్ ఆర్ఎగ్జిక్యూటివ్గా పనిచేసింది. ఆమె సాక్షి టివి తెలుగు న్యూస్ ఛానెల్లో యాంకర్గా కెరీర్ ప్రారంభించింది. మొదట్లో అనసూయ సినిమాల ఆఫర్లను తిరస్కరించింది. ఆమె భరద్వాజ్ అనే యాంకర్ని పెళ్లాడింది.
అనసూయ ‘వేదం’ , ‘పైసా’ చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేసింది, తరువాత ఆమె తెలుగు కామెడీ షో జబర్దస్త్లో యాంకర్గా కనిపించింది. బుల్లితెరకు వచ్చిన ఆమె ఒక సపరేట్ ఐకాన్ యాంకర్ గా అనసూయ పలు ప్రోగ్రామ్స్ కు తనదైన మార్కు వేసింది.
అనసూయ ‘నాగ’ 2003, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ 2016, ‘క్షణం’ 2016, ‘విజేత’ 2017, ‘గాయత్రి’ 2018, ‘రంగస్థలం’ 1820 ‘2018’ చిత్రాలలో నటించింది. ‘యాత్ర’ 2019, ‘మీకు మాత్రమే చెప్తా’ 2019, ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ 2021, ‘పుష్ప: ది రైజ్’ 2021.

ఆమె 2022లో ‘భీష్మ పర్వం’, ‘ఖిలాడీ’, ‘పక్కా కమర్షియల్’ ‘రంగ మార్తాండ’ చిత్రాలలో భాగంగా బిజీగా ఉంది. ఆమె ఫిలింఫేర్ అవార్డ్ సౌత్, IIFA ఉత్సవం, రెండు SIIMA అవార్డులను గెలుచుకుంది. ‘క్షణం’ 2016 ‘రంగస్థలం’ 2018లో ఆమె పని చేసింది.