365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, మార్చి 17, 2025: కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే నొప్పిని తగ్గించే నూతన చికిత్సా కార్యక్రమా న్ని అపోలో హాస్పిటల్స్ ప్రారంభించింది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మార్చి 17న అట్టహాసంగా జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ వైద్యులు, నిపుణులు హాజరయ్యారు.
కీళ్ల నొప్పులకు శస్త్రచికిత్స లేకుండా పరిష్కారం..

కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాపు సమస్యలు, స్నాయువు గాయాలతో బాధపడుతున్న రోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ శస్త్రచికిత్స అవసరం లేకుండా సమర్థవంతమైన చికిత్సను అందిస్తుంది. కీళ్ల పనితీరును మెరుగుపరిచేలా, బాధితులకు శక్తివంతమైన జీవనశైలిని అందించేలా దీన్ని రూపొందించారు.
Read this also…The World’s 10 Most Powerful Countries in 2025: India’s Rising Influence
ఇది కూడా చదవండి…జియో క్రికెట్ బంపర్ ఆఫర్ – 90 రోజుల పాటు ఐపీఎల్ ఉచితం!
అన్ని వయస్సుల వారికి లాభం..
అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ, “ఈ ప్రోగ్రామ్ కీళ్ల నొప్పులతో బాధపడే ప్రతి వయస్సు వారికీ ప్రయోజనాన్ని అందించేందుకు రూపొందించాం. టైలర్డ్ అడ్వైజ్, ట్రీట్మెంట్, థెరఫీస్, రీహాబిలిటేషన్, పోషకాహారం, ప్రత్యామ్నాయ చికిత్సలు వంటి ‘3 Ts’పై ప్రత్యేక దృష్టి పెట్టాం. దీని ద్వారా బాధితులు నొప్పుల నుంచి ఉపశమనంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించగలరు” అన్నారు.
ఆధునిక చికిత్సల వినియోగం
అపోలో హాస్పిటల్స్ చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ & ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కె. జె. రెడ్డి మాట్లాడుతూ, “కీళ్ల నొప్పుల నివారణకు ఆధునిక ఆర్థ్రోస్కోపిక్ పద్ధతులను వినియోగిస్తూ, పూర్తిగా కీలు మార్చాల్సిన అవసరం లేకుండా పరిష్కారం చూపే విధానంపై మేము దృష్టి సారించాం” అని తెలిపారు.
సంపూర్ణ చికిత్సా విధానం
ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రవితేజ రుద్రరాజు మాట్లాడుతూ, “ఈ ప్రోగ్రామ్ అత్యాధునిక రీ జెనరేటివ్ చికిత్సలను సమగ్రమైన రీహాబిలిటేషన్, పోషకాహార పద్ధతులతో మిళితం చేసి సమగ్ర చికిత్సను అందిస్తుంది” అని వివరించారు.
జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్లోని ముఖ్యాంశాలు:
- ప్లేట్లెట్-రిచ్ ప్లాస్మా (PRP) చికిత్స
- స్టెమ్ సెల్ ఆధారిత పునరుత్పత్తి చికిత్స
- అధునాతన ఆర్థోబయోలాజిక్ చికిత్సలు
ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బ్రెట్ ఫ్రిట్ష్, అపోలో హాస్పిటల్స్ సీఈఓ తేజస్వి రావు, సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ కౌశిక్ రెడ్డి, డాక్టర్ ప్రశాంత్ మేష్రామ్, డాక్టర్ వరుణ్ కొమ్మలపాటి తదితరులు పాల్గొన్నారు.
కీళ్ల నొప్పుల సమస్యలకు సుస్థిరమైన పరిష్కారం అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఈ నూతన కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. apollohospitals.com