365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 7, 2026: ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గజం ‘అప్రిలియా ఇండియా’ తన రేసింగ్ వారసత్వాన్ని నగరవాసులకు పరిచయం చేస్తూ హైదరాబాద్‌లో ‘అప్రిలియా RS457 ట్రాక్ డే’ను ఘనంగా నిర్వహించింది. వాహన చోదకులలో వృత్తిపరమైన రేసింగ్ నైపుణ్యాలను పెంపొందించడం ,మోటర్‌స్పోర్ట్ సంస్కృతిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది.

హైదరాబాద్‌లోని శ్రే ఆటోమోటివ్స్ ప్రతినిధి సుశీల్ దుగార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్‌ వేదికగా ఉన్న ‘చికేన్ సర్క్యూట్’లో రైడర్లకు శిక్షణ ఇచ్చారు. జాతీయ రేసింగ్ ఛాంపియన్ శ్రీ హర్ష నేతృత్వంలోని నిపుణుల బృందం రైడర్లకు కీలకమైన అంశాలపై అవగాహన కల్పించింది.

ఇదీ చదవండి..సంగీత ప్రియులకు పండుగ: ‘రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్’ సీజన్ 4 షెడ్యూల్ విడుదల ..

ఇదీ చదవండి..ఓలా, ఉబెర్‌ల ఆధిపత్యానికి చెక్..’భారత్‌ టాక్సీ’క్యాబ్‌ సేవలు..

శిక్షణలోని ప్రధానాంశాలు:

ట్రాక్ బేసిక్స్,భద్రతా నియమాలు.

సరైన రైడింగ్ భంగిమ (Posture),బ్యాలెన్స్.

ఇదీ చదవండి..‘లింగ నిర్ధారణ’ శస్త్రచికిత్స ఎలా చేస్తారు..?

ఇదీ చదవండి..తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం..

కార్నరింగ్ టెక్నిక్స్,రేసింగ్ లైన్స్.

హై-పెర్ఫార్మెన్స్ బైక్‌లపై నియంత్రణ సాధించడం.

ఈ ట్రాక్ డేలో కేవలం శిక్షణ మాత్రమే కాకుండా, అప్రిలియా సరికొత్త మోడళ్ల ప్రదర్శన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే ఉన్న కస్టమర్లతో పాటు కాబోయే రైడర్ల కోసం అప్రిలియా RS457, టువోనో 457 మోడళ్లను ఇక్కడ ప్రదర్శించారు.

నిర్మాణాత్మకమైన క్లాస్‌రూమ్ సెషన్లు,ప్రత్యక్ష ట్రాక్ శిక్షణ ద్వారా రైడర్లు తమ బైకింగ్ నైపుణ్యాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. అప్రిలియా బ్రాండ్ రేసింగ్ DNAను కస్టమర్లకు మరింత దగ్గర చేయడంలో ఈ ‘ట్రాక్ డే’ విజయవంతమైందని నిర్వాహకులు వెల్లడించారు.