365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, మార్చి 16,2025: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ పియాజియోకు చెందిన అప్రిలియా టుయోనో 457 మోడల్ బైక్ తిరుపతిలో అందుబాటులోకి వచ్చింది. శనివారం నికిమోటార్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి మురళీమోహన్, ఈ కొత్త మోడల్ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి పియాజియో రీజినల్ మేనేజర్ క్రాంతికుమార్, డీలర్ నాగభూషణ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి...మ్యూచువల్ ఫండ్స్లో సిప్ రకాలు ఏమిటి..? ఏది ఎక్కువ లాభం..?
ఇది కూడా చదవండి...హాస్యంతో మెప్పించిన ‘మజాకా’.. జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్
రూ.3,96,149 (ఎక్స్-షోరూమ్ ధర) ధరతో విడుదలైన ఈ బైక్, పిరాన రెడ్,ప్యూమా గ్రే అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది. ఈ మోడల్ను బుక్ చేసుకునేందుకు రూ.10,000 అడ్వాన్స్ చెల్లించాలి. బుకింగ్స్ను www.shop.apriliaindia.com వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు.

ఈ సందర్భంగా పియాజియో డొమెస్టిక్ 2W విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ రఘువంశి మాట్లాడుతూ, “ఒక సంవత్సరం క్రితం విడుదలైన అప్రిలియా RS457 దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు అదే విజయాన్ని తిరుపతిలో టుయోనో 457 కూడా కొనసాగిస్తుందని మేము ఆశిస్తున్నాం” అని అన్నారు.
Read this also…Sundeep Kishan’s Hit Comedy ‘Mazaka’ Premieres on TV This Sunday at 6 PM!
Read this also…Aaroha Launches to Redefine Business Leadership Through Indian Philosophy
ఈ కార్యక్రమంలో వెస్పా కాలా టెక్ స్కూటర్ను కూడా ఆవిష్కరించారు.