365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్‌ 30,2025: చాలా మంది ప్రజలు, చిన్న వ్యాపారాలు వారి తక్షణ అవసరాలను తీర్చడానికి బంగారంపై రుణాలుతీసుకుంటున్నారు. భారతదేశంలో బంగారు రుణ మార్కెట్ పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం, బంగారంపై తీసుకునే రుణాలు 2028-29 నాటికి రెట్టింపు అయ్యి రూ. 14.19 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.

గత కొన్నాళ్లుగా బంగారం తీసుకునే వినియోగదారుల సంఖ్య పెరిగిందని మార్కెట్ విశేషకులు వెల్లడిస్తున్నారు. 13 లక్షల మందికి పైగా కొత్త కస్టమర్లు బంగారు రుణాలు తీసుకున్నారు. వ్యక్తిగత రుణాల కంటే బంగారు రుణాలు పొందడం సులభం, త్వరగా ప్రాసెస్ అవుతాయి.

బంగారం ధరలు అస్థిరంగా ఉండటంతో బంగారు రుణాలు ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బంగారం ధర తక్కువగా ఉంటే, రుణాలు తీసుకున్న కస్టమర్లు వాటిని తిరిగి చెల్లించడంలో ఇబ్బంది పడవచ్చు.