365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మే 12,2025: రహదారులు, పార్కులు, చెరువులు వంటి ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలను భద్రపరచాల్సిన కాలనీ సంక్షేమ సంఘాలే వాటిని అమ్మకాలకు దారిచెడుతున్నాయి. ప్రజావసరాల కోసం లే ఔట్ల్లో చూపిన స్థలాలను కొన్ని సంక్షేమ సంఘాల నేతలు ప్లాట్లుగా మారుస్తూ ప్రైవేటు పరిశ్రమలకు విక్రయిస్తున్నారని హైడ్రా ప్రజావాణిలో నివాసితులు ఫిర్యాదు చేశారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని సర్వే నెం.181, 183 పరిధిలో ఉన్న సాయిలక్ష్మి లే ఔట్లో 1800 గజాల పార్కు స్థలం ఆక్రమణకు గురైందని తెలుస్తోంది. అదే విధంగా సర్వే నెం.153, 154, 155లలో దాదాపు 5 ఎకరాల ప్రభుత్వ స్థలాలు కనబడడం లేదని నివాసితులు వాపోతున్నారు. వీటితో పాటు 2.3 ఎకరాల వీఎన్ఆర్ పార్కు స్థలాన్ని కూడా ఆక్రమించారని తెలిపారు.
Read this also..Mohan Vadlapatla’s Thriller M4M to Premiere at Cannes Film Festival
Read this also..Tollywood Hero Krishna Sai Lends a Helping Hand to Junior Artist Potti Johnny..
లే ఔట్ మాయమయ్యిందంటూ ఆరోపణలు
కూకట్పల్లి హైదర్నగర్లోని డైమండ్ హిల్స్ కాలనీ ప్లాట్ల యజమానులు లే ఔట్ను పూర్తిగా చెరిపేసి ప్రైవేటుగా భూకబ్జా చేశారని ఆరోపించారు. 9 ఎకరాలలో 70 ప్లాట్లు ఉన్న లే ఔట్ను స్వాధీనం చేసుకున్నారని, 2024లో హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చినా ఇప్పటివరకు ఖాళీ చేయించలేకపోతున్నామని వాపోయారు.

రహదారులపై గోడలు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీలోని దేవరయాంజల్ గ్రామంలో జాతీయ రహదారిని ఓఆర్ఆర్తో కలిపే 40 అడుగుల రహదారిపై ప్రహారీ నిర్మించి రాకపోకలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
జీహెచ్ఎంసీ పార్కు ఆక్రమణ
హయత్నగర్ అనుమగల్లో 2955 గజాల జీహెచ్ఎంసీ పార్కును కొందరు ఆక్రమించారని, దానిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కేటాయించిన రూ.1.20 కోట్ల ప్రాజెక్టును అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు కూడా ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ఉన్నా, వారు ఇంకా స్థలం విడిచిపెట్టలేదని నివాసితులు వాపోయారు.
Read this also..Idea : How to Plan a Stunning Wedding Menu on a Tight Budget
ఇది కూడా చదవండి…అదిరిపోయే వెడ్డింగ్ మెనూను తక్కువ బడ్జెట్లో ఇలా ప్లాన్ చేయవచ్చు..
తుర్కచెరువులో అక్రమ నిర్మాణాలు
బాచుపల్లి మండలం తుర్కచెరువులోని ఎఫ్టీఎల్ స్థలం, ఇతర ప్రభుత్వ భూములపై నిర్మాణాలు సాగుతున్నాయని, వెంటనే వాటిని అడ్డుకోవాలని నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
హైడ్రా స్పందన
వీటికి సంబంధించి గూగుల్ మ్యాప్స్ ద్వారా పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో మొత్తం 61 ఫిర్యాదులు నమోదయ్యాయి.