baba_vanga_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి13,2023: ప్రపంచ ప్రఖ్యాత ప్రవక్తలలో బల్గేరియన్ ప్రవక్త బాబా వంగా ప్రిడిక్షన్ అంచనాలు ప్రజలను భయపెడుతున్నాయి. బాబా వంగా 2023 సంవత్సరంలో జరిగే అతిభయం కరమైన సంఘటనల గురించి చెప్పారు.

బాబా వంగ అంచనాలు నిజమైతే భూమిపై పెనుప్రమాదం తప్పదా..? బల్గేరియాకు చెందిన అంధురాలైన బాబా వంగాను బాల్కన్ ప్రాంతానికి చెందిన నోస్ట్రాడమస్ అని పిలుస్తారు. బాబా వంగా 12 ఏళ్ల వయసులో కంటి చూపు కోల్పోయారు.

ఇటీవల టర్కీ, సిరియాలో భూకంపాలు పెను విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడు ఆసియాలోనూ ఇలాంటి భూకంపం వస్తుందని చెబుతున్నారు. భారతదేశం గురించి కూడా ఆమె అంచనా వేశారు. బాబా వంగా ఈ విషయాన్ని ముందే చెప్పారు.

ఆమె చెప్పినవాటిలో చాలా వరకూ నిజమయ్యాయి. ఆమె 2023 సంవత్సరంలో భారతదేశంలో జరిగే వాటిని గురించి కూడా అంచనా వేసారు. అవే జరిగితే పెను విపత్తు సంభవించక తప్పదా..?

నెదర్లాండ్స్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్‌బీట్స్ టర్కీ, సిరియా పరిసర ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయని అంచనా వేశారు, అవి నిజమని నిరూపించబడ్డాయి. బాబా వంగా ప్రకృతి వైపరీత్యాలను కూడా అంచనా వేశారు. 2023లో కూడా ఎన్నో భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని వెల్లడించారు.

ఫ్రాంక్ హూగర్‌బీట్స్ భారతదేశం గురించి అంచనా వేశారు. భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌-పాకిస్థాన్‌లు కూడా పెద్ద భూకంపాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చని అంటున్నారు. బాబా వంగా కూడా భారత్‌తో సహా అనేక ఆసియా దేశాల గురించి ఇలాంటి అంచనాలు వేశారు.

ఆసియా దేశంలో అణు విస్ఫోటనం జరుగుతుందని, దీని వల్ల భారత్‌లో భారీ నష్టం వాటిల్లుతుందని బాబా వంగా చెప్పారు. ఒక భౌగోళిక సంఘటన జరుగుతుంది, దాని కారణంగా భూమి కక్ష్య మారుతుంది. ఈ ఘటన వల్ల లక్షల మంది చనిపోతారు.

భూ కక్ష్యలో మార్పుల వల్ల భయంకరమైన భూకంపాలు వస్తాయని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు ఏదో ఒక దేశంలో భూకంపం వస్తుందేమోనన్న ఆందోళన నెలకొంది. 2023లో సునామీ కూడా వస్తుందని బాబా వంగా తెలిపారు.