Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 17, 2024: ఖాతాదారుల ను పాలసీలు కొనుగోలు చేసేందుకు బ్యాంకులు, జీవిత బీమా కంపెనీలు మోసపూరిత, అనైతిక పద్ధతులను అవలంబిస్తు న్నాయని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్)కు నిరంతరం ఫిర్యాదులు అందుతున్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులను సెన్సిటివ్‌గా మార్చినట్లు జోషి తెలిపారు.

బ్యాంకులు బీమా ఉత్పత్తులను తప్పుగా విక్రయించడాన్ని అరికట్టాలి,ఖాతాదారులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

బీమా ఉత్పత్తులను తప్పుగా విక్రయించడాన్ని ఆపాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రభుత్వం కోరింది. ఖాతాదారుల ప్రయోజనాలకు రక్షణ కల్పించాలని కూడా కోరింది.

ఖాతాదారులను పాలసీలు కొనుగోలు చేసేందుకు బ్యాంకులు, జీవిత బీమా కంపెనీలు మోసపూరిత, అనైతిక పద్ధతులను అవలంభిస్తు న్నాయని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్)కు నిరంతరం ఫిర్యాదులు అందుతున్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులను సెన్సిటివ్‌గా మార్చినట్లు జోషి తెలిపారు. ఖాతాదారుల ప్రయోజనాలకు బ్యాంకులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. టైర్ II,III నగరాల్లో 75 ఏళ్లు పైబడిన వినియోగదారులకు జీవిత బీమా పాలసీలను విక్రయించిన అనేక కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా బ్యాంకులు తమ అనుబంధ బీమా కంపెనీల ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రయత్నిస్తాయి.

దీనిపై ఖాతాదారులు నిరసన వ్యక్తం చేస్తే.. పై నుంచి ఒత్తిడి వస్తోందని బ్రాంచ్ అధికారులు చెబుతున్నారు. కస్టమర్లు ఏదైనా రకమైన రుణం తీసుకోవడానికి లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి వెళ్లినప్పుడు, వారికి బీమా ఉత్పత్తులను విక్రయించే ప్రయత్నాలు చేస్తారు.

బ్యాంకులు తమ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోను సమీక్షించాలని కోరినట్లు జోషి తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను పాటించనందుకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి.. Youtube Tips : సెర్చ్ లో మీ యూట్యూబ్ ఛానెల్ ఫస్ట్ ర్యాంక్ లో ఉండాలంటే..?