BHOGA SRINIVASA MURTHY AVATAROTSAVAM OBSERVEDBHOGA SRINIVASA MURTHY AVATAROTSAVAM OBSERVED
BHOGA SRINIVASA MURTHY AVATAROTSAVAM OBSERVED
BHOGA SRINIVASA MURTHY AVATAROTSAVAM OBSERVED

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, జూన్20,2021:తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా  సహస్రకలశాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా  సహస్రకలశాభిషేకం నిర్వహించారు.

చారిత్రక నేపథ్యం :

BHOGA SRINIVASA MURTHY AVATAROTSAVAM OBSERVED
BHOGA SRINIVASA MURTHY AVATAROTSAVAM OBSERVED

పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తారు.టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శేఖర్ రెడ్డి, కుమారగురు తదితరులు పాల్గొన్నారు.