365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 29,2023: భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా రాష్ట్ర స్థాయి పదాధికారుల కోర్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి అధ్యక్షతన రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేస్తూ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా జిల్లాలోని రాష్ట్ర స్థాయి పదాధికారుల కోర్ కమిటి సమావేశం నిర్వహించారు.

ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు జిల్లాలోని ప్రజలకు బిజెపి నాయకులు అందరు తమవంతుగా ఎప్పటికపుడు అండగా ఉండాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ చెప్పారు.
ఈ సమావేశంలో డా.ప్రేమ్ రాజ్, తల్లోజు ఆచారి, తూళ్ల వీరేందర్ గౌడ్, అందేల శ్రీరాములు , అందే బాబయ్య, నెల్లి శ్రీవర్దన్ రెడ్డి, కొత్త అశోక్ గౌడ్,నోముల దయానంద్ గౌడ్,కోలన్ శంకర్ రెడ్డి,బోసుపల్లి ప్రతాప్, కాంజర్ల ప్రకాష్, పోరెడ్డి అర్జున్ రెడ్డి, జంగయ్య యాదవ్, మిద్దెల సుదర్శన్ రెడ్డి, పాపయ్య గౌడ్, దేవులపల్లి అశోక్ గౌడ్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.