Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే 18, 2023: బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని ఎలాంటి సంక్షేమ పథకాలను కేటాయించకుండా కె చంద్రశేఖరావు సర్కారు అబద్ధపు ప్రచారంతో మోసం చేస్తూ బీసీలను అణిచివేస్తున్నదని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ విమర్శించారు.

రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి నాయకులతో కలిసి నాగోల్ శుభం గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చ సమ్మేళనంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఓబీసీ సమ్మేళనానికి ముఖ్య అథితిగా హాజరైన “బిజెపి జాతీయ ఓబీసీ మోర్చ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా.లక్ష్మణ్ ను” మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అంతా మోసమేనని, కేవలం ప్రచార హార్భాటం తప్ప మరొకటి లేదని మండి పడ్డారు.

ఈ కార్యక్రమంలో శంషాబాద్ మండల ఓబీసీ మోర్చ అధ్యక్షులు మల్చలం మోహన్ రావు, శంషాబాద్ మండల బిజెపి ఉపాధ్యక్షులు బురుకుంట సంజీవ, నర్కూడ సర్పంచ్ సునిగంటి సిద్ధులు, ఎల్గని నాగేష్, మల్చలం లింగం, నీరటి నాగేష్, బురుకుంట నాగేష్, కుమ్మరి భాస్కర్, వీరేష్ తోపాటు ముఖ్య బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.