
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదారాబాద్,ఫిబ్రవరి 11,2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ వివాహ వేడుక శుక్రవారం హైటెక్స్ వేదికగా అంగరంగవైభవంగా జరిగింది. కదిరి బాలక్రిష్ణ సుపుత్రిక పూజితను సందీప్ వివాహామాడారు. ఈ వివాహ వేడుకలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, టాలీవుడ్ సినీతారలు పాల్గొన్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలక్రిష్ణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి–భారతి, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్లు హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వీరితో పాటు మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి, నాగబాబు, రోజా, బండ్ల గణేశ్, మాజీ హోం మంత్రి జానా రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మేల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎంపి మధు యాష్కి, మాజీ బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మన్, బెల్లం కొండ శ్రీనివాస్–గణేష్, కోమటి రెడ్డి సోదరులు, కే కేశవారావు, పొన్నాల లక్ష్మయ్య.. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయ ప్రముఖులు ఎంపీ విజయ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణ, ఎమ్మేల్యే అంబటి రాంబాబు, హోం మంత్రి సుచరిత, ఎంపీ మిధున్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని, అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాస్ రావు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ తదితర అతిరథ మహారథులు పాల్గొన్నారు.