Sun. Sep 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 3,2023: ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన అన్ని మోడళ్ల ధరలను పెంచింది.

కాబట్టి TVS తన iQube ధరలను పెంచింది. Ather Energy కూడా ఈవీ వెహికల్స్ ధరలను పెంచింది. అంతేకాదు ఆంపియర్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్ల ధరలను కూడా పెంచింది. ఇప్పుడు ఈ కంపెనీ ఈ-స్కూటర్‌ను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు రూ.39,000 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ జూన్ 1 నుంచి కిలోవాట్‌కు రూ.15,000 సబ్సిడీ మొత్తాన్ని రూ.10,000కి తగ్గించింది. దీంతో కంపెనీ వాటిని పెంచింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల జేబులపై పెనుభారం మోపుతోంది.

అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మీరు ఈ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకుంటే అదనంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆంపియర్ అనేది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఉన్న కంపెనీ. సబ్సిడీ కట్ తర్వాత OLA ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల గురించి గందరగోళం నెలకొంది.

ఆంపియర్ ఇ-స్కూటర్ కొత్త ధరలు..

ఆంపియర్ శ్రేణిలో అత్యల్ప ధర ఉత్పత్తి ఇప్పుడు Zeal EX. దీని ధర రూ.20,900 పెరిగింది. మిడ్-టైర్ Magnus EX కొత్త ధర ఇప్పుడు రూ. 104,900. దీని ధర కూడా రూ.21,000 పెరిగింది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 నుంచి 100 కిలోమీటర్ల మేర వెళ్తాయి. ఈ శ్రేణిని IDC ధృవీకరించిందని కంపెనీ తెలిపింది.

ఈ చిన్న SUV సెల్టోస్ ,కేరెన్స్‌లకు గట్టిపోటీ ఇచ్చింది, మేలో 8251 వెహికల్స్ పైగా అమ్ముడుపోయి నంబర్-1గా నిలిచింది. ఆంపియర్ ప్రైమస్ అనేది కంపెనీ మొదటి మోడల్. LFP బ్యాటరీలను ఉపయోగించే ఏకైక ఆంపియర్ ఉత్పత్తి కూడా ఇది.

ప్రైమస్ కొత్త ధర ఇప్పుడు రూ. 1.49 లక్షలుగా ఉంది. ఇంతకుముందు దీని ధర రూ.1.09 లక్షలు. అంటే దాదాపు రూ.40,000 ధరను కంపెనీ పెంచింది. దేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న టాప్-5 కంపెనీలో ఆంపియర్ కూడా చేరింది.

error: Content is protected !!