Fri. Oct 18th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ ,అక్టోబర్ 18,2024 : గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ వయాసాట్ సహకారంతో, భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL నిర్వహించిన డైరెక్ట్ టు డివైస్ (D2D) టెక్నాలజీ ప్రయోగం విజయవంతమైంది.

ఈ కొత్త టెక్నాలజీ ఆండ్రాయిడ్, iOS స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర స్మార్ట్ పరికరాలకు అనుకూలంగా ఉంటుంది. నెట్‌వర్క్ విఫలమైనప్పుడు లేదా మారుమూల ప్రాంతాల్లో కూడా నిరంతర కనెక్టివిటీని అందించడం ఈ సాంకేతికత ప్రత్యేకత.

D2D కనెక్టివిటీ మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు మాత్రమే కాకుండా, కార్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం స్థానంతో సంబంధం లేకుండా వినియోగదారులకు నమ్మకమైన కనెక్టివిటీని అందిస్తుంది.

ఈ కొత్త టెక్నాలజీ ట్రయల్ విజయవంతమైందని Viasat,BSNL ప్రకటించాయి. ఇలాంటి ప్రయోగం దేశంలోనే తొలిసారి జరిగింది.

Viasat NTN కనెక్టివిటీ ద్వారా Android స్మార్ట్‌ఫోన్‌లలో ఉపగ్రహం ద్వారా రెండు మార్గాల సందేశాలు (టూ-వే మెసేజింగ్)SOS సేవలను అందించడం ప్రారంభమైంది. 36,000 కి.మీ దూరంలో ఉన్న వయాసాట్ జియోస్టేషనరీ ఎల్-బ్యాండ్ ఉపగ్రహం ద్వారా ఈ సందేశం పంపబడింది. భారతీయ వినియోగదారులు వయాసాట్ సేవలను సెల్‌ఫోన్‌ల ద్వారా సులభంగా ఉపయోగించుకోవచ్చని వయాసాట్ తెలిపింది.

error: Content is protected !!