365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగళూరు, నవంబర్ 14, 2025:దేశంలోని అతిపెద్ద డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ ఫోన్పే ప్రపంచ ప్రముఖ ఏఐ కంపెనీ ఓపెన్ఏఐతో వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటించింది. ఈ ఒడంబడిక ద్వారా భారత్లో ChatGPT ఫీచర్లు ఫోన్పే యూజర్లకు నేరుగా అందుబాటులోకి రానున్నాయి.
ప్రయాణ ప్రణాళికలు, షాపింగ్, రోజువారీ అవసరాలకు సంబంధించిన తెలివైన సమాచారం అందించే స్థాయికి ఫోన్పే యూజర్ అనుభవాన్ని ఈ భాగస్వామ్యం మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది.
ChatGPT ఇకపై

#ఫోన్పే కన్స్యూమర్ యాప్లో
#ఫోన్పే ఫర్ బిజినెస్ యాప్లో
#ఇండస్ యాప్స్టోర్తో సహా మొత్తం ఫోన్పే ఎకోసిస్టమ్లో కనిపించనుంది.
దేశంలో జెనరేటివ్ ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, కోట్లాది మంది భారతీయులకు అత్యాధునిక ఏఐ సాంకేతికతను సులభంగా అందించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడనుంది.
ఫోన్పే సహవ్యవస్థాపకుడు, హోల్ టైమ్ డైరెక్టర్ & సీటీఓ రాహుల్ చారి మాట్లాడుతూ,
“దేశవ్యాప్తంగా డిజిటల్ సేవలకు బలమైన పునాదులు వేయడానికి మేం సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం.
అత్యాధునిక సాంకేతికతను సామాన్యులకు చేరువ చేసేందుకు ఓపెన్ఏఐతో ఈ భాగస్వామ్యం ఒక మైలురాయి. ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది” అని అన్నారు.

ఓపెన్ఏఐ ఇంటర్నేషనల్ హెడ్ ఒలివర్ జే అన్నారు:“భారత్ ప్రపంచ ఆవిష్కరణల కేంద్రం. దేశ పరిస్థితులు, యూజర్ బేస్పై ఫోన్పేకి ఉన్న లోతైన అవగాహన వారిని మాకు ఆదర్శ భాగస్వామిగా నిలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా కోట్లాది మంది భారతీయుల రోజువారీ జీవితాన్ని మరింత సులభతరం చేయగలుగుతాం.”
ప్రస్తుతం ఫోన్పే వద్ద 61 కోట్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు, 4.4 కోట్ల మంది మర్చంట్లు ఉన్నారు. ఈ భారీ యూజర్ బేస్తో భారత్లో ఏఐని అత్యంత వేగంగా, విస్తృతంగా అందించే అవకాశం ఈ భాగస్వామ్యం సృష్టించనుంది.
