365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్5,2025: టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఆసక్తికర సీరియల్స్‌ను వరుసగా అందిస్తోన్న జీ తెలుగు మరో మల్టీలేయర్ ఫ్యామిలీ డ్రామాను ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. ప్రేమ, బాధ, విధి వలయాల్లో అల్లుకున్న ఓ కథ… ‘‘దీర్ఘ సుమంగళీ భవ’’ పేరుతో ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రతిరోజూ (సోమవారం నుంచి శనివారం వరకు) మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం కానుంది.

Read this also…Zee Telugu Unveils Its New Fiction Drama ‘Dheerga Sumangali Bhava’, Premiering on 7th April

ఇది కూడా చదవండి…Rs.42,999 ప్రారంభ ధరతో Samsung Galaxy Tab S10 FE సిరీస్ భారత్‌లో లాంచ్..

ఈ సీరియల్ కథానాయిక అహల్య (మహీ గౌతమి) ఓ టైలర్. అనారోగ్యంతో బాధపడుతున్న తన అమ్మమ్మను అమర్నాథ్ యాత్రకు తీసుకెళ్లాలని కలలుకంటూ జీవితం సాగిస్తుంటుంది. ఆ యాత్రలో ఆమె ఓ సైనికుడైన ఇంద్ర (పవన్ రవీంద్ర)ను ప్రేమిస్తుంది. కానీ విధి వాళ్ల ప్రేమకు బ్రేక్ వేసి, ఇంద్ర ప్రాణాలు కోల్పోతాడు. ప్రేమను కోల్పోయిన అహల్య భవిష్యత్తు ఎలా ఉంటుంది? మళ్లీ జీవితం పై ఆశను ఎలా పొందుతుంది? అన్నదే ఈ కథ సారాంశం.

ఈ సీరియల్‌లో మహీ గౌతమి, ప్రతాప్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. పవన్ రవీంద్ర, శ్రీలక్ష్మి, జాకీ, ఆశారాణి, సుమిత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సీరియల్‌లో ఉన్న ఎమోషనల్ టర్నింగ్ పాయింట్లు, మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని టీమ్ చెబుతోంది.

ఇది కూడా చదవండి…తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో బాబు జగ్జీవన్ రామ్ కుటుంబం కీలక పాత్ర పోషించింది: వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి జానయ్య”

ఇది కూడా చదవండి…ఎలక్ట్రానిక్స్‌పై రూ.25 వేల వరకు తగ్గింపు: రిలయన్స్ డిజిటల్ ‘డిజిటల్ డిస్కౌంట్ డేస్’ ప్రారంభం

ప్రసార సమయాల్లో మార్పు:
ఈ కొత్త సీరియల్ ప్రారంభంతో జీ తెలుగు ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముక్కుపుడక మధ్యాహ్నం 12 గంటలకు, సీతే రాముడి కట్నం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రసారమవుతాయి.