railway-pass-for-journalist

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నిజామాబాద్,ఆగష్టు14,2022: జర్నలిస్టులకు ట్రైన్ టిక్కెట్లో రాయితీని రైల్వే బోర్డు నిలిపేసిన విషయం తెలిసిందే. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే.శ్రీనివాస్ రెడ్డి, బల్విందర్ సింగ్ లు రైల్వే బోర్డు ఉన్నతాధికారులతో పాటు కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిపి జర్నలిస్టులకు రైలుటి క్కెట్ రాయితీని కొనసాగించాలని వినతి పత్రాలు సమర్పించారు.

railway-pass-for-journalist

అలాగే ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అంతేకాకుండా మే 10న, దేశ వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో జర్నలిస్టులకు రైల్వే పాస్ లను జారీ చేయాలని ఐజేయూ డిమాండ్ చేసింది.

railway-pass-for-journalist

ఐజేయూ డిమాండ్ పై పునరాలోచించిన రైల్వే బోర్డు ఎట్టకేలకు సీనియర్ సిటిజెన్స్ తో పాటు జర్నలిస్టులకు రాయితీని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో రైల్వే శాఖ అధికారులకు ఉన్నతాధికారుల నుండి సంకేతాలు రావడంతో రైల్వే పాస్ ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. జర్నలిస్టులు తమ సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లలో పాస్ లను పొందగలరు.

railway-pass-for-journalist

రైలు టిక్కెట్లో రాయితీ కోసం పట్టువీడకుండా ప్రయత్నం చేసిన ఐజేయూ నాయకత్వానికి, ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రులకు, రైల్వే బోర్డు అధికారులకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) పక్షానా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని టీయుడబ్ల్యుజె తెలంగాణరాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ వెల్లడించారు.