365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ మే11,2025 : అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “ఈ సృష్టికి మూలం అమ్మ. స్వచ్ఛమైన ప్రేమ, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం అమ్మ” అని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి…చూపు లేకున్నా 94 మంది జీవితాలలో వెలుగులు నింపుతున్న మాతృమూర్తి..
ఇది కూడా చదవండి…పాక్ వక్రబుద్ధి.. శాంతి అంటూనే మళ్లీ దాడి..
కుటుంబం, సమాజం, దేశ నిర్మాణంలో తల్లి పాత్ర కీలకమని మంత్రి అన్నారు. భావి పౌరులను తీర్చిదిద్దే అమ్మ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుంద ని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక క్లినిక్ల ద్వారా మహిళలకు వైద్య సేవలు అందిస్తు న్నామని, లక్షల మంది మహిళలు ఈ సేవలను వినియోగించుకుంటున్నారని మంత్రి చెప్పారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రాల ద్వారా తల్లి, బిడ్డలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

రొమ్ము క్యాన్సర్ ముప్పును ముందుగానే గుర్తించి మహిళలను కాపాడేందుకు మొబైల్ స్క్రీనింగ్ యూనిట్లను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన వెల్లడించారు.
“అమ్మను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా సంఘాల ద్వారా చేయూత నిస్తున్నాం. రాజీవ్ యువ వికాసం ద్వారా లక్షల మంది యువతులు లబ్ధి పొందనున్నారు. అమ్మకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భవిష్యత్తులో మరిన్ని పథకాలను అందుబాటులోకి తీసుకొస్తాం.
ఈ సందర్భంగా మీ ఆశీర్వాదం ప్రజా ప్రభుత్వంపై ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు” అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ సందర్భంగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న తల్లులందరినీ మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.