365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 3,2025: అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన యాడ్వర్టైజ్మెంట్ హోర్డింగులను స్వయంగా తొలగించుకునేందుకు యాడ్ ఏజెన్సీలకు ఆదివారం వరకూ గడువు ఇస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
ఈ గడువులోగా స్వయంగా తొలగించని హోర్డింగులను హైడ్రా అధికారులు తీసివేయనున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి…పాత లే ఔట్లపై కబ్జాల జోరు – హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు
ఇది కూడా చదవండి…సైన్స్ ఫిక్షన్ నుంచి వాస్తవ ప్రపంచానికి.. స్మార్ట్ఫోన్ నుంచి వీడియో కాలింగ్ వరకూ!
గత మూడు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నా, యాడ్ ఏజెన్సీలకు అప్పటికే అనేక అవకాశాలు ఇచ్చామని కమిషనర్ పేర్కొన్నారు.
గత రెండు నెలలుగా మున్సిపల్ కమిషనర్లు, యాడ్ ఏజెన్సీ ప్రతినిధులతో పలు సమావేశాలు నిర్వహించిన విషయాన్ని కమిషనర్ గుర్తు చేశారు.

2022-23 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన రుసుముల గడువు 2024 మార్చి 31వరకూ ఉన్నా, కొత్త విధానం ఖరారవ్వకపోవడంతో రీన్యూవల్ ఆగిపోయిందని యాడ్ ఏజెన్సీలు తెలిపారు.
2023 మార్చి 31 వరకూ రుసుము చెల్లించిన హోర్డింగుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు వాటిని తొలగించమని, ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హైడ్రా కమిషనర్ ప్రకటించారు.
అనుమతి లేని హోర్డింగుల తొలగింపులో ఎలాంటి మినహాయింపులు ఉండవని, ప్రభుత్వ ఆదాయం పెరగడమే హైడ్రా లక్ష్యమని కమిషనర్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి…ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు: 20 శాతం ఓట్లకు పైగా చెల్లనివి
Read this also...MLC Polls Vote Counting: 20% Invalid Votes Create Major Concern
ఆదివారం బాలాపూర్లో అనుమతి లేని హోర్డింగులను తొలగించిన సందర్భంగా, అఖిల యాడ్ ఏజెన్సీ యజమానిపై మిగతా ఏజెన్సీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మీర్పేట అనుమతులను చూపించి బాలాపూర్ చౌరస్తాలో అక్రమంగా హోర్డింగులు ఏర్పాటు చేయడం నిర్ధారణ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

తొలగించిన హోర్డింగులను హైడ్రా తుక్కుగా అమ్మేస్తుందన్న ఆరోపణలను మిగతా యాడ్ ఏజెన్సీలు ఖండించాయి.
యాడ్ ఏజెన్సీలు ప్రభుత్వ కొత్త విధానాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని, నూతన విధానం వచ్చే వరకు తగిన చర్యలు తీసుకోవాలని కోరాయి.