365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 20,2023:ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా ప్రకారం 62 ఏళ్ల టిమ్ కుక్ సంపద 1.8 బిలియన్ డాలర్లు అంటే 14 వేల కోట్ల రూపాయలు. 2022 సంవత్సరంలో కుక్ $ 99.4 మిలియన్లు అంటే రూ. 815 కోట్ల మొత్తాన్ని అందుకున్నారు.
ఇందులో 3 మిలియన్ల డాలర్ల జీతం కూడా ఉంది. ఇది కాకుండా, $ 83 మిలియన్ స్టాక్ అవార్డు, బోనస్ కూడా అందుకున్నారు. ఇది 2021లో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ. 2021లో, అతను $ 98.7 మిలియన్లను పొందారు.
టిమ్ కుక్ రోజు సంపాదన ఎంత..?

2023లో అతని ఆదాయానికి కోత విధించినప్పటికీ, మొత్తం పరిహారం $49 మిలియన్లు అంటే రూ.401 కోట్లు. దీని ప్రకారం ఐఫోన్ కంపెనీ సీఈవో రోజువారీ సంపాదన రూ.1.10 కోట్లకు పైగానే ఉంది. టిమ్ కుక్ 2026లో పదవీ విరమణ చేయనున్నారు. నియంత్రిత స్టాక్ను కూడా తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది.
టిమ్ కుక్ అమెరికాలోని ఆగ్నేయ ప్రాంతంలోని అలబామా నుంచి వచ్చారు. అతని తండ్రి షిప్యార్డ్ కార్మికుడు అతని తల్లి ఫార్మసీలో పనిచేసేది.1988లో అతను నార్త్ కరోలినాలోని డర్హామ్లోని డ్యూక్ యూనివర్శిటీ ఆధ్వర్యంలోని ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. 2011లో యాపిల్ సీఈవోగా నియమితులయ్యారు.
భారతదేశంలో టిమ్ కుక్: ఆపిల్ భారతదేశంలో మొదటి అధికారిక రిటైల్ స్టోర్ను ఇటీవల ప్రారంభించింది. అంతేకాదు ఢిల్లీలో రిటైల్ స్టోర్ ను కూడా ఏర్పాటుచేసింది.

ముంబైలోని బ్రాండ్ రిటైల్ స్టోర్ను కుర్లా కాంప్లెక్స్, జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ప్రారంభించగా, సాకేత్ సిటీ వాక్ మాల్లోని ఢిల్లీ స్టోర్ను కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. ఢిల్లీ,ముంబై స్టోర్ల అద్దె దాదాపు ఒకే విధంగా ఉంటుంది, అయితే ఢిల్లీ స్టోర్ ముంబై స్టోర్లో సగం కంటే తక్కువ ఉంటుంది.
ఢిల్లీ స్టోర్ ప్రారంభోత్సవానికి ముందు యాపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దీంతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఐటీ శాఖ డిప్యూటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్లను కూడా టిమ్ కుక్ కలిశారు.
అదే సమయంలో, ముంబై రిటైల్ స్టోర్ ప్రారంభానికి ముందు, టిమ్ కుక్ ముంబైలో మాధురీ దీక్షిత్, అర్మాన్ మాలిక్, అనిల్ కుంబ్లే వంటి ప్రముఖులను కలిశారు. వ్యాపార సమావేశంలో టిమ్ కుక్ కూడా ముఖేష్ అంబానీ సొంత ఇల్లు యాంటిలియాకు చేరుకున్నారు.