365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఏప్రిల్16, 2025 : సమయానికి విలువనిచ్చే గొప్ప వ్యక్తి డా.హిప్నో కమలాకర్ అని లయన్స్ క్లబ్ 320A డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ డా.జి. మహేంద్ర కుమార్ రెడ్డి అన్నారు. డా. హిప్నో కమలాకర్ జయంతి – వర్థంతి సందర్భంగా బుధవారం సమయపాలనపై అవగాహన, అన్నదాన కార్యక్రమాన్ని హైదరాబాద్, బేగంబజార్ ఎస్.ఆర్.డి. రెయిన్ బో హోమ్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని డా. హిప్నో కమలాకర్ మైండ్ & పర్సనాలిటీ కేర్, నవభారత్ లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించాయి. డా. మహేంద్ర కుమార్ రెడ్డి , సంఘం తెలంగాణా అధ్యక్షుడు సాగర్ల రఘు, లయన్ జయశ్రీ, అడ్వకేట్ వెంకటేశ్వరరావు, లయన్ గాయత్రి, డా.హిప్నో పద్మా కమలాకర్, వసతి గృహం హెడ్ రాణి విద్యార్థులకు పుస్తకాలు అందజేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఘన నివాళి అర్పించారు.

ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ 320A డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ డా. మహేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ డా. కమలాకర్ గారు సమయపాలనకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి అన్నారు. ఆయన “టైమ్‌కు ముందే రావాలి, సమయాన్ని వృథా చేయకూడదు” అనే సిద్ధాంతాన్ని జీవితవిజయానికి మూలస్తంభంగా భావించేవారని తెలిపారు.

ఆదివారాలు, సెలవుదినాలు కూడా నేర్చుకునే అవకాశాలుగా మలచుకోవాలన్నది ఆయన అభిప్రాయమ న్నారు. అందుకే ఆయన సామాజిక సమానత్వం కోసం, చైతన్యం తెచ్చేలా 20,000వెల ప్రోగ్రామ్స్ చేసిన ” ఫైటర్”, 100 పుస్తకాలు రాసిన “రైటర్” అని కొనియాడారు. సంఘం తెలంగాణా అధ్యక్షుడు సాగర్ల రఘు మాట్లాడుతూ ఆయన గొప్ప మానవతా వాది అన్నారు.

అంతే కాకుండా హిప్నాటిజం, సైకాలజీ మేళవించి అనేక మానసిక సమస్యలు నివారించవచ్చని సమాజానికి చాటి చెప్పిన మహా మేధావి అని అన్నారు. ఈరోజుల్లో సైకాలజీ గురించి అందరికీ అవగాహన వచ్చిందంటే కమలాకర్ కారణమన్నారు. మానసిక సమస్యలు ఇలా ఉంటాయని కూడా తెలియజేసింది ఆయనేనని తెలిపారు.

ఈరోజు ఆయన లేకపోవడం సమాజానికి చాలా నష్ట మని ఆవేదన వ్యక్తంచేశారు. అడ్వకేట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కమలాకర్ వృత్తినే ఇంటి పేరుగా మార్చుకుని దేశవ్యాప్తంగా హిప్నాటిజం ప్రదర్శనలు చేసి మనిషిలో వున్న శక్తి, సామర్థ్యాలను నిరూపించిన ఘనత డా.హిప్నో కమలాకర్ కే దక్కుతుందన్నారు.

Read this also…PhonePe goes live with UPI Circle

ఇది కూడా చదవండి...అమర్‌నాథ్ యాత్ర 2025: ఆన్‌లైన్ – ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, తేదీలు- మార్గాలు.. పూర్తివివరాలు..


డా.హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ కమలాకర్ ఒక టీచర్, లాయర్, జర్నలిస్టు, సామాజికవేత్త,అని కొనియాడారు. తన జీవితాన్ని సమాజానికి అంకితమిచ్చిన మహోన్నత వ్యక్తి ఆయన అన్నారు. సమయాన్ని గౌరవిస్తే అది మీ భవిష్యత్తును వెలుగులోకి తీసుకెళ్తుందన్నారు. ఒక్క నిమిషం ఆలస్యం ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుందని చెప్పారు.అందుకే… సమయం కి గౌరవం ఇవ్వాల్సిందే నన్నారు.


ఈ సందర్భంగా లయన్ గాయత్రి పాటలు ద్వారా విద్యార్థులకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న సందేశాన్ని ఇచ్చారు . వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పాటు కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.