richter-scale_

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 21,2023: టర్కీ-సిరియాలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. టర్కీ-సిరియా సరిహద్దు ప్రాంతంలో రెండు కి.మీ (1.2 మైళ్లు) లోతులో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) నివేదించింది.

టర్కీ-సిరియాకు సహాయం చేసేందుకు భారత్ రెస్క్యూ టీమ్‌ను పంపింది. రెస్క్యూ ఆపరేషన్‌ ముగించుకుని బృందం తిరిగి వచ్చింది. అంతకుముందు ఫిబ్రవరి 6 న, భూకంపంశక్తివంతమైన ప్రకంపనలలో 40 వేలకు మందికి పైగా చనిపోయారు.

అంతకుముందు ఫిబ్రవరి 6న, టర్కీ- సిరియాలో తీవ్రమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఒకట్రెండు రోజుల తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు వచ్చాయి.

richter-scale_

శక్తివంతమైన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 41,000 దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఈ షాక్‌తో ఆందోళనలు పెరిగాయి.

టర్కీ-సిరియాకు సహాయం చేసేందుకు భారత్ రెస్క్యూ టీమ్‌ను పంపింది. రెస్క్యూ ఆపరేషన్‌ ముగించుకుని బృందం తిరిగి వచ్చింది.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా సోమవారం ఆయనతో సమావేశమై మాట్లాడారు. టర్కీ – సిరియాలకు సహాయం చేయడానికి భారతదేశం ‘ఆపరేషన్ దోస్త్’ను అమలు చేసింది.

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) చివరి బృందం టర్కీ నుంచి తిరిగి వచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

ఆపరేషన్ దోస్త్ కింద టర్కీకి పంపిన చివరి NDRF బృందం తిరిగి వచ్చిందని బాగ్చి ట్వీట్ చేశారు.151 మంది జవాన్లు, మూడు డాగ్ స్క్వాడ్ బృందాలు టర్కీకి చేరాయి.