365 తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,అమరావతి, నవంబర్ 7,2022: నెల్లూరు జిల్లాలో భూకంపం వచ్చింది. నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలంలో ఈరోజు ఉదయం మూడు సెకన్లపాటు భూమి కంపించడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భయాందోళనకు గురైన ప్రజలు చాలా సేపు ఇళ్ల బయటే ఉండిపోయారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వింజమూరు, కొండాపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో ఇటీవల జిల్లాలోని నాలుగు మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి.
ఇదిలావుంటే, ఉత్తరాఖండ్లోని తెహ్రీలో ఆదివారం భూకంపం సంభవించగా రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం, భూకంపం ఉత్తర కాశీకి తూర్పు-ఆగ్నేయంగా 17 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఉదయం 8.33 గంటలకు భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ తెలిపింది.
వాయిస్ అసిస్టెంట్ ‘హే సిరి’ పేరు మార్చనున్న ఆపిల్
భారతదేశంలో Twitterకి బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ $8 చెల్లించాలి
ఇవాళ బంగారం ధరలు ఎంతంటే..?
టీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం
TTD makes changes in VIP break darshan timings in Tirupati
Chalo Raj Bhavan to pass the Common Recruitment Bill
