365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,డిసెంబర్ 18,2022: విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నేషనల్ స్పోర్ట్స్ మీట్-2022ను విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి రేణుకా సింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పీడిక రాజన్న దొర శనివారం ప్రారంభించారు.
ఈ నెల 22వ తేదీ వరకూ 6 రోజుల పాటు గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ, విజయవాడ వేదికలుగా ఈ క్రీడలు జరగనున్నాయి. 22 రాష్ట్రాల నుంచి 4300 మందికి పైగా గిరిజన విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనేందుకు తరలివచ్చారు.
ఈ సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ సరుటా మాట్లాడుతూ.. కృష్ణానది ఒడ్డున, దుర్గా మాత ఒడిలో జాతీయ క్రీడోత్సవాలు జరగడం పెద్ద సంబరమని తెలిపారు. ఆకాశమే హద్దుగా ఆటలాడండి..మీ ప్రతిభ చాటండని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆదివాసీలు ప్రకృతిలో భాగమన్నారు.
నేటి చిన్నారులే రేపటి ప్రఖ్యాత క్రీడాకారులని తెలిపారు. సిక్కింలో మంచి మైదానమే లేదని, అలాంటి చోటు నుంచి కూడా విద్యార్థులు రావడం గర్వకారణమన్నారు. త్రిపుర, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ గిరి బిడ్డలు కూడా క్రీడల్లో రాణిస్తున్నారన్నారు.
టోక్యో ఒలింపిక్ క్రీడల్లో సైనా నెహ్వాల్, అభినవ్ బింద్ర లాంటి వారు ప్రతిభ చాటారని కొనియాడారు. క్రీడల్లో రాణించిన వారు పార్లమెంట్ సభ్యులుగానూ రాణించిన వారు కోకొల్లలుగా ఉన్నారని తెలిపారు. గౌతమ్ గంభీర్ లాంటి వారు క్రికెట్ తో పాటు నేరుగా రాజకీయ క్రీడలోనూ సత్తా చాటారని గుర్తుచేశారు.
పి.టి ఉష, మహేంద్రసింగ్ ధోనీ లంటి వారు అత్యంత గౌరవనీయమైన పురస్కారాలందుకున్నారన్నారు. మీరా బాయి చాను లాంటి గిరిజన తెగ నుంచి వచ్చిన వారు ఓ వెలుగు వెలిగారు, ఎంతో మందికి స్ఫూర్తి నింపారని కొనియాడారు. నేటి కాలంలో ఏకలవ్యుడి వంటి ఎంతో మంది శిష్యులు.. మరెందరో ద్రోణాచార్యులు ఉన్నారన్నారు.
ఎక్కడి నుంచి వచ్చాం అన్నది కాదు చివరికి ఏం సాధించామనే స్ఫూర్తితో ముందుకు సాగండని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, క్రీడా మైదానాలు సహా రేపటి చిన్నారులకు అన్ని వసతులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
దేశవ్యాప్తంగా 30 లక్షల మందికి కేంద్రం ఉపకార వేతనాలిచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. చదువుకు ప్రత్యామ్నాయం క్రీడలనేలా ప్రధాన మంత్రి మోదీ చర్యలు తీసుకున్నారన్నారు. క్రీడలకు, క్రీడాకారులకు పూర్తిగా కేంద్ర సహకారం అందిస్తోందన్నారు.

సంకల్పమే మహా బలంగా ముందుకు సాగాలని తెలిపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ సరుటా తమ ప్రసంగాన్ని ముగించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్న దొర మాట్లాడుతూ.. గిరిజన విద్యార్ధులు క్రీడల పోటీలు ఆంధ్రప్రదేశ్ లో జరగడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు.
గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా సహకారంతో రాష్ట్రంలో గిరిజన క్రీడోత్సవాలు నిర్వహించే అవకాశం రావడం సంతోషించే విషయమని మంత్రి తెలిపారు.
గిరిజనులంటే సీఎం జగన్ కు ఎంతో ప్రేమ అని.. జిల్లాల విభజనలో రెండు జిల్లాలు కేటాయించడం ఇందుకు నిదర్శనమన్నారు.
గిరిజనుల అభివృద్ధిని నిరంతరం కాంక్షించే వ్యక్తి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ అని, గిరిజన విద్యార్దులు అన్ని రంగాల్లో రాణించాలనేదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు.
విద్యార్దులు క్రీడల్లో రాణించే విధంగా సాప్ సహకారంతో రాష్ట్రంలో 5 జిల్లాల్లో (శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, ప్రకాశం, కర్నూలు) 5 స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు చేయడం ముదావహమని తెలిపారు.
27.39 శాతం ఉన్న గిరిజనుల జనాభా కంటే ఎక్కువగా గిరిజనులకు ముఖ్యమంత్రి మేలు కల్పిస్తున్నారని వివరించారు. విద్యాపరంగా జగనన్న విద్యాకానుక, 3,04,6909 లబ్ది పొందుతున్నారని, గిరిజన సంక్షేమ శాఖ 1లక్షా 52వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు.

జగనన్న అమ్మఒడి ద్వారా 2,86,379 మంది గిరిజన విద్యార్ధులు రూ.1272.52 కోట్లు లబ్ది పొందారన్నారు.
జగనన్న వసతి దీవెన.. హాస్టల్స్ లో చదివే విద్యార్ధులు 10 నుండి 20 వేల రూపాయల వరకూ ఎకడమిక్ క్వాలిఫికేషన్స్ ఆధారంగా 63,392 మంది లబ్ది పొందుతున్నారని తెలిపారు పొందుతున్నారు.
జగనన్న విద్యా దీవెన 96,991 విద్యార్ధులు లబ్ది పొందుతున్నాన్నారు. స్కూల్ రీయంబర్స్ మెంట్ పథకాలు ఏపీ ప్రభుత్వం గిరిజన విద్యార్ధులకు రూ.243 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
జగనన్న గోరుముద్ద ద్వారా 3,84,745 విద్యార్ధులు రూ.271 కోట్లు లబ్ది పొందుతున్నారని తెలిపారు. గిరిజనుల సంక్షేమాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అలాగే గిరిజనులకు ROFR పట్టాల కింద 2,48,887 ఎకరాల పట్టాలు 1లక్ష 26వేల కుటుంబాలకు పైగా లబ్ది చేకూర్చామని తెలిపారు.
ఏపీలో 379 ఆశ్రం స్కూల్స్, 18 ప్రీ మెట్రిక్ హాస్టల్స్, 163 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చిన 81 హాస్టల్స్ లో మొత్తంగా 1,72,278 విద్యార్ధులు ఉన్నారని వివరించారు.