365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 15,2025: మణికొండలో హైటెన్షన్ విద్యుత్ తీగల కింద ఉన్న భూమితో పాటు, నాలాను ఆక్రమించి ఏర్పాటు చేసిన రేకుల ప్రహారీని శనివారం అధికారులు తొలగించారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు:హైటెన్షన్ విద్యుత్ తీగల కింద ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలను ఉల్లంఘించడం మాత్రమే కాకుండా, చారిత్రక బుల్కాపూర్ నాలాను ఓ నిర్మాణ సంస్థ ఆక్రమిస్తోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో అధికారుల బృందం గురువారం రంగంలోకి దిగింది.
ఇది కూడా చదవండి…చార్మినార్ పరిసరాల్లో ఈద్ షాపింగ్ సందడి.. రాత్రి వేళల్లో కోలాహలం
Read this also…Hyderabad’s Charminar Bustles with Late-Night Eid Shopping Frenzy
ఇది కూడా చదవండి…రైతులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం
క్షేత్రస్థాయిలో పరిశీలన: మణికొండ మరిచెట్టు వద్ద ఓ నిర్మాణ సంస్థ నాలాను కలిపేసుకుని, హైటెన్షన్ లైన్ల కింద నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు శనివారం అక్కడ ఏర్పాటు చేసిన రేకుల ప్రహారీని తొలగించారు.

బుల్కాపూర్ నాలా ప్రాముఖ్యత: శంకరపల్లి బుల్కాపూర్ చెరువుతో పాటు ఖానాపూర్, కోకాపేట్, నార్సింగ్, పుప్పలగూడ, మణికొండ, దర్గా, షేక్పేట్, టోలిచౌకి, పోచమ్మబస్తీ, చింతలబస్తీ మీదుగా హుస్సేన్ సాగర్కు వర్షపు నీటిని తరలించే ప్రధాన నాలాగా బుల్కాపూర్ నాలా విస్తరించింది.
Read this also…Gold Storage Rules: How Much Gold Requires Tax Payment?
ఇది కూడా చదవండి…గోల్డ్ స్టోరేజ్ రూల్స్ : ఎంత బంగారం కొంటే టాక్స్ కట్టాల్సి ఉంటుంది..?
దీనిని పునరుద్ధరిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. హుస్సేన్ సాగర్కు వర్షపు నీటిని తీసుకెళ్లే ఏకైక ప్రధాన నాలా కావడంతో దీని పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.