
EO RELEASES BOOK
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,సెప్టెంబరు 28,2021:టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి మంగళవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శ్రీ కలిగిరి మాహాత్మ్యము పుస్తకాన్ని ఆవిష్కరించారు.
పెనుమూరు, పూతలపట్టు మండలాల మధ్యలోని కలిగిరి కొండపై కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహత్యాన్ని భక్తులకు అందించేందుకు చిత్తూరుకు చెందిన విద్వాన్ చలంకోట బురుజు మునస్వామి ఈ పుస్తకాన్ని రచించారు. చిత్తూరుకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఎం.దొరస్వామి నాయుడు ఈ పుస్తకాన్ని ముద్రించారు.
