365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 18, 2025: ఆఫ్రికా ఖండంలోని అతి పెద్ద విమానయాన సంస్థగా నిలిచిన ఇథియోపియా ఎయిర్‌లైన్స్, భారత్‌లో తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ హైదరాబాద్ నగరానికి నేరుగా విమాన సర్వీసును జూన్ 16న ప్రారంభించింది. వారానికి మూడు సార్లు నడిచే ఈ సర్వీసును ఆడిస్ అబాబా బోలే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రతినిధులు, రాయబారులు, గౌరవ అతిథులు విమానయాన రంగ ప్రముఖులు హాజరయ్యారు.

కొత్త సర్వీసు వివరాలు:

  • ET 682 – ఆడిస్ అబాబా (ADD) నుంచి హైదరాబాద్ (HYD): సోమవారం, బుధవారం, శనివారం
  • ET 683 – హైదరాబాద్ (HYD) నుంచి ఆడిస్ అబాబా (ADD): మంగళవారం, గురువారం, శనివారం

ఈ సందర్భంగా ఇథియోపియా ఎయిర్‌లైన్స్ గ్రూప్ సీఈఓ మెస్ఫిన్ తసెవ్ మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరానికి మా కొత్త సర్వీసు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది భారత్‌లోని మాకు ఐదో గమ్యం. ఈ విమాన సర్వీసు ద్వారానే కాకుండా, రెండు దేశాల మధ్య వాణిజ్య, పర్యాటక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి” అని తెలిపారు.

అతను ఇంకా మాట్లాడుతూ, “ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలందించడమే మా లక్ష్యం. భారత్‌తో పాటు ఈ ప్రాంతంలో మేము మా నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. ఆఫ్రికాలో అగ్రగామిగా ఉన్న మా సంస్థ, ప్రపంచ స్థాయి సేవలతో సరిహద్దులు దాటి భాగస్వామ్యాల మద్దతుతో ముందుకెళ్తుంది” అన్నారు.

ఇది కూడా చదవండి…వేవ్ ఫార్చూన్ స్మార్ట్‌వాచ్‌తో కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల విప్లవం – యాక్సిస్ బ్యాంక్, బోట్, మాస్టర్‌కార్డ్ సంయుక్తంగా ఆవిష్కరణ..

Read This also…Axis Bank Partners with boAt and Mastercard to Launch Contactless Payments on the New Wave Fortune Smartwatch..

ప్రస్తుతం ఇథియోపియా ఎయిర్‌లైన్స్ భారతదేశంలోని ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై నగరాలకు సుమారు 50కి పైగా ప్రయాణికుల కార్గో విమాన సర్వీసులు అందిస్తోంది.

ఇప్పుడు హైదరాబాద్‌కు కొత్తగా ప్రారంభించిన ఈ సర్వీసు, సంస్థకు భారతదేశంలో మరింత ప్రాధాన్యం తీసుకొస్తుంది. అంతేగాక, ప్రయాణికులకు నిరాడంబరమైన, వేగవంతమైన అంతర్జాతీయ ప్రయాణ అనుభవాన్ని అందించనుంది.

ఇథియోపియా ఎయిర్‌లైన్స్ విస్తరణ భారత-ఆఫ్రికా సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.