365తెలుగుడాట్కామ్,ఆన్లైన్,న్యూస్,ఫిబ్రవరి21,2021,హైదరాబాద్ : ప్రముఖ యోగా-మెడిటేటర్, ఎనర్జీ హీలర్ భువనగిరి కిషన్ నీటిపై శవాసనం వేశారు.
ఇలా నీళ్ల పైన శవాసనం వేస్తూ ఎంతసేపైనా ఉండగలుగుతానని అంటున్నారు ఆయన. అయితే ఈ శవాసనం వేయడానికి శరీర పరిమాణంతో గానీ, వయసుతో గానీ సంబంధం లేదు.

యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, లేదా రిగ్యులర్ గా బ్రీతింగ్ ఎక్సర్ సైజు వంటివి ఎన్నో ఏళ్లుగా సాధన చేస్తున్నవారికే సాధ్యం కాదు,…అలాంటిది భువనగిరి కిషన్ నీటిపై తేలియాడుతూ అవలీలగా ఈ ఆసనం వేసి చూపించారు.16 ఏళ్లుగా యోగా, ధ్యానమ్ చేస్తూ అనారోగ్యంగా ఉన్నవారికి ఎనర్జీ హీలింగ్ సేవలు సైతం అందిస్తున్నారు భువనగిరి కిషన్. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్ ను గురించి కూడా తన జ్యోతిషం ద్వారా తెలియజేశారు.

రాజకీయ జ్యోతిష్య పండితులు సైతం ఆయన ఇచ్చిన విశ్లేషణ, చెప్పిన గణాంకాలను చూసి అవాక్కయ్యారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల్లో జరిగిన జనరల్ ఎలక్షన్ల దగ్గర నుంచి ఇటీవల జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో… ఏ పార్టీ కి ఎన్ని సీట్లు…? ఏ పార్టీ కి అధికారం దక్కుతుందో అనే విషయాలు సైతం భువనగిరి కిషన్ చెప్పినవి చెప్పినట్లుగా జరిగాయి.