
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,జూలై 7,2021:హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఫెర్టిలైజర్స్ తయారీ సంస్థ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్వారు 301 ఫెర్టిలైజర్స్ బస్తాలను శ్రీవారికి విరాళంగా అందించారు.

తిరుమల పాపావినాశనం రోడ్డులో గల టిటిడి గార్డెన్ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎమ్.డి.సమీర్గోయిల్, ప్రెసిడెంట్ శంకర్ సుబ్రమణ్యం రూ.2.73 లక్షలు విలువైన 14-35-14 – గ్రోశక్తి 140 బస్తాలు, భూభాగ్యా- 101 బస్తాలు, ఎన్రిచ్ – 20 బస్తాలు, కెరిచ్ – 20 బస్తాలు, పాస్గోల్డ్ – 20 బస్తాలు కలిపి మొత్తం 15 టన్నుల ఫెర్టిలైజర్స్ బస్తాలను టిటిడి గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులుకు అందచేశారు.

కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్వారు తమ క్రొత్త ఉత్పత్తులను మొదట శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది నూతన ఉత్పత్తులైన గ్రోశక్తి, భూభాగ్యాలను స్వామివారికి సమర్పించారు.