365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 6,2025: ఒకప్పుడు వెండితెరపై మెరిసిన నటి, ఇప్పుడు జిల్లాకు కలెక్టర్! చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ రంగంలోకి అడుగుపెట్టి, అద్భుతమైన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్న హెచ్ఎస్ కీర్తన తన సినీ కెరీర్ ను కొనసాగించి, కొన్నాళ్లకే నటనకు గుడ్బై చెప్పారు. ఆమె లక్ష్యం ఐ ఏ ఎస్ అధికారి కావడం. అందుకోసం ఆమె అహర్నిశలూ శ్రమించారు.
హెచ్ఎస్ కీర్తన నటిగా కెరీర్ ప్రారంభించి మలయాళంలో కర్పూరద గొంబే, గంగా-యమునా, ముదిన అలియా, ఉపేంద్ర, ఏ వంటి చిత్రాల్లో నటించారు. ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆమె, మంచి ఫామ్లో ఉన్నప్పటికీ యుపిఎస్సిలో ర్యాంక్ సాధించడం కోసం ఎంతో కష్టపడ్డారు.
ఇది కూడా చదవండి…వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం అమలులోకి కొత్త చట్టం..
ఇది కూడా చదవండి…Rs.42,999 ప్రారంభ ధరతో Samsung Galaxy Tab S10 FE సిరీస్ భారత్లో లాంచ్..
ఆరు సార్లు ప్రయత్నించిన తర్వాత సివిల్స్ లో167 ర్యాంక్ సాధించారు. ఈ విజయానికి ముందు కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (KAS) పరీక్షలో ఉత్తీర్ణులై, రెండు సంవత్సరాలు KAS అధికారిగా పనిచేశారు.

నటిగా వెండితెరపై వెలుగులు నింపిన ఆమె, పట్టుదలతో సివిల్ సర్వీసెస్లోకి అడుగుపెట్టి, ఇప్పుడు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హెచ్ఎస్ కీర్తన రియల్ స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది..!