

తిరుపతి,జూన్ 24,2021: అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం సాయంత్రం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు గజ వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహించారు.సిరుల తల్లి లక్ష్మీదేవికి గజం ఇష్టవాహనం. గజం స్వామివారికి వాహనంగా విశేష సేవలు అందిస్తోంది.
