365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 30, 2025: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి K. నాగమణి, అలాగే డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీ M. కిష్టయ్య, సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ G.E. చింతలపల్లి విద్యాసాగర్ వారిని ఘనంగా సన్మానించి, సుదీర్ఘకాలం విశ్వవిద్యాలయానికి అందించిన సేవలను ప్రశంసించారు. వీరిద్దరూ అత్యంత అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వహించి విశ్వవిద్యాలయానికి తగిన గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు. కష్టపడి పనిచేసే వారికి ఎల్లప్పుడూ గౌరవం దక్కుతుందని తెలిపారు.

ఇది కూడా చదవండి…హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మైలురాయి: ‘ది కాస్కేడ్స్ నియోపోలిస్’ ప్రాజెక్ట్ ప్రారంభం..

Read This also…River Expands Footprint in Andhra Pradesh with First Vijayawada Store

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ జాయింట్ రిజిస్ట్రార్ శ్రీ D. శివాజీ, విశ్వవిద్యాలయం అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, అలాగే నాగమణి, కిష్టయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.