365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,జూన్ 2,2025 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా జరుపుకుంటారు. ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్‌లోని PJTSAU పరిపాలన భవనం ఆవరణలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి, ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య నివాళులు సమర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఇది కూడా చదవండి…SSPL – దక్షిణభారతదేశపు అతిపెద్ద టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెస్టివల్..

Read This also…SSPL Grand Launch: South India’s Biggest Tennis Ball Cricket League..

ఈ సందర్భంలో విశ్వవిద్యాలయ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రోజున విశ్వవిద్యాలయం రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన మూల విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టిన గొప్ప కార్యక్రమం సాగుతుందని వివరించారు.

దాదాపు అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని, రాష్ట్ర అవతరణ వేడుకలలో ఎంపికైన అభ్యుదయ రైతులకు ప్రధాన పంటల మూల విత్తనాలను అందించనున్నట్టు అల్దాస్ జానయ్య తెలిపారు. రాష్ట్రంలో సగం జనాభాకు సేవలు అందించే బాధ్యత విశ్వవిద్యాలయానికి లభించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి…టొవినో థామస్ ఎమోషనల్ సీన్లలో ప్రేక్షకులని కట్టిపడేసిన “నరివెట్ట” చిత్రం..!

ఇది కూడా చదవండి…నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 లక్ష్యాలను సాధించేలా యూనివర్సిటీలకు చేయూతనిస్తున్న NIAT

ఇంకా, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘రైతు ముంగిటలో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని తెలియజేశారు. వచ్చే ఏడాది మరిన్ని వినూత్న కార్యక్రమాలతో రైతాంగానికి మరింత సేవలు అందించేందుకు విశ్వవిద్యాలయం ప్రణాళికగా కృషి చేయనున్నట్లు ఉపకులపతి అల్దాస్ జానయ్య బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులను పిలుపునిచ్చారు.