
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,మే 21,2022: తిరుమలలో ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆకాశగంగ, జపాలి, ధర్మగిరి ప్రాంతాల్లో ఘనంగా జరుగనున్నా యి.నాదనీరాజనం వేదికపై మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరుగనుంది.
ఇక్కడ మే 25న “అంజనానందనం వీరం” అనే అంశంపై ఆచార్య రాణి సదాశివమూర్తి, మే 26న “సుందరే సుందరః కపిః” అనే అంశంపై డా. ఆకెళ్ల విభీషణశర్మ, మే 27న “వీరో హనుమాన్ కపిః” అనే అంశంపై డా. ఎం.పవనకుమార్ శర్మ, మే 28న “జ్ఞానినామగ్రగణ్యం” అనే అంశంపై ఆచార్య రాణి సదాశివమూర్తి, మే 29న “రామవైభవ స్ఫూర్తి” అనే అంశంపై డా. ఎం.జి.నందనరావు ఉపన్యసిస్తారు .ఆకాశగంగ వద్దగల శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయం వద్ద ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ప్రముఖ పండితులు శ్రీ హనుమ అవతార ఘట్ట ప్రవచనాలు చేస్తారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో భక్తిసంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జపాలి శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో భక్తిసంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.మే 29న ధర్మగిరి వేదపాఠశా లలో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వలకు సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది.