365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మే 31,2025: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్‌ఐ) రోడ్ సేఫ్టీపై పిల్లల దృష్టిని మెరుగుపరచేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడపలో ఒక భారీ అవగాహన క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2400 మంది విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, హోండా ప్రభుత్వ ఐటీఐలు (కడప, యేర్రగుంట్ల), మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన ఐటీఐలో చేరిన విద్యార్థులు, సిబ్బంది రోడ్ సేఫ్టీ సంబంధిత అనుభవాత్మక శిక్షణ పొందారు. రోడ్ సేఫ్టీపై శిక్షణ ద్వారా రైడింగ్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన పెంపొందించడం లక్ష్యంగా తీసుకున్న ఈ కార్యక్రమం, రహదారి భద్రతకు సంబంధించిన ప్రాథమిక విషయాలను ఆకర్షణీయంగా అందించింది.

రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ 2022 గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 21,249 రోడ్డు ప్రమాదాలు, 8,293 మరణాలు, 21,340 గాయాల సంఘటనలు నమోదయ్యాయి. ఈ గణాంకాలు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తాయి.

ఇది కూడా చదవండి…ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ అసిస్టెంట్ సీతాలక్ష్మి పదవీ విరమణ

ఇది కూడా చదవండి…వరద సమస్య పరిష్కారం కోసం హైడ్రా, జీహెచ్ఎంసీ సంయుక్త పరిశీలన..

కడపలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమం ముఖ్యంగా యువతలో సురక్షిత రైడింగ్ అలవాట్లను మేల్కొల్పేందుకు ఏర్పాటు చేశారు. ఇందులో రైడింగ్ సేఫ్టీ థియరీ, హెల్మెట్ ధరించే ప్రాముఖ్యత, స్టాటిక్ డెమోన్స్ట్రేషన్లు, ఆటలు, క్విజ్‌లు వంటి ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించారు. ట్రాఫిక్ సైగ్నల్స్ అర్థం చేసుకోవడం, చిన్న చిన్న మార్పులు ఎలా పెద్ద ప్రయోజనాలు అందిస్తాయో నేర్పించడం వంటి విషయాలు అన్ని వయస్సుల వారికి సరిపోయేలా వివరించారు.

హెచ్ఎంఎస్‌ఐ దేశవ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ భవిష్యత్తు రైడర్లలో బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించేందుకు కృషి చేస్తోంది. పాఠశాలలు, కళాశాలలతో భాగస్వామ్యంతో వీటిని నిర్వహించడం ద్వారా సమాజంలో రోడ్ సేఫ్టీపై అవగాహన మరింత విస్తరుస్తోంది.

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 2021లో ప్రకటించిన ‘2050 గ్లోబల్ విజన్’ ప్రకారం, 2050 నాటికి రవాణా ప్రమాద మరణాలను పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యం పెట్టుకుంది. అదే విధంగా భారత ప్రభుత్వం 2030 నాటికి రవాణా ప్రమాద మరణాలను సగానికి తగ్గించాలని దిశానిర్దేశం చేసింది. ఈ లక్ష్య సాధనలో పిల్లలలో రోడ్ సేఫ్టీ పట్ల సానుకూల దృష్టిని కల్పించడం కీలకం.

హెచ్ఎంఎస్‌ఐ ఈ దిశగా పాఠశాలలు, కళాశాలల్లో రోడ్ సేఫ్టీ విద్యను ప్రోత్సహిస్తూ ఒక భద్రతా సంస్కృతిని పుట్టించేందుకు కృషి చేస్తోంది. ఇది యువతను భద్రతాపరులుగా తీర్చిదిద్దడంతో పాటు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుంది.

ఇది కూడా చదవండి…ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం –పొగాకు బాలల భవితకు ముప్పు

ఇది కూడా చదవండి…ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం ప్రత్యేక ఫెలోషిప్ బోధనా కార్యక్రమం ప్రారంభం

హెచ్ఎంఎస్‌ఐ దేశవ్యాప్తంగా 10 ట్రాఫిక్ ట్రైనింగ్ పార్కులు (TTP),6 సేఫ్టీ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ సెంటర్లలో (SDEC) నిపుణులైన ఇన్‌స్ట్రక్టర్లు ప్రతిరోజూ శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాలు 97 లక్షల మందికి పైగా భారతీయులకు చేరుకున్నాయి.

ఇంకా, హెచ్ఎంఎస్‌ఐ ఇటీవల ‘ఈ-గురుకుల్’ అనే డిజిటల్ రోడ్ సేఫ్టీ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. 5 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్లాట్‌ఫారమ్ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ మాడ్యూల్స్ ను egurukul.honda.hmsi.in ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది లైవ్ స్ట్రీమింగ్, డౌన్లోడ్ ఆప్షన్స్‌తో సమగ్ర రోడ్ సేఫ్టీ విద్యను అందిస్తోంది.

హెచ్ఎంఎస్‌ఐ సమాజానికి అవసరమైన సంస్థగా మారాలని, రోడ్ సేఫ్టీపై వినూత్న ఆలోచనలతో సమాజానికి అవగాహన కల్పించేందుకు సంకల్పంతో ఉంది.