365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 29,2025: ప్రతి ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తేనే సంస్థలు అభివృద్ధి చెందుతాయని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ G.E.Ch. విద్యాసాగర్ పేర్కొన్నారు. వ్యక్తిగత, వృత్తి జీవితాల మధ్య సమతుల్యతను పాటిస్తూ బాధ్యతలు నిర్వహించాలని సూచించారు.

ఇది కూడా చదవండి..సినీ ఫోటో జర్నలిస్ట్ ఆర్‌కే చౌదరికి హీరో కృష్ణసాయి ఆర్థిక సహాయం

Read this also…Actor Krishna Sai Extends Financial Support to Cine Photojournalist RK Choudhary

ఇది కూడా చదవండి..MG అస్టర్: భారతదేశపు మొట్టమొదటి AI SUV ఇప్పుడు ‘బ్లాక్‌బస్టర్ SUV’!

విశ్వవిద్యాలయంలో 29 సంవత్సరాలు 6 నెలలుగా సేవలందించి, ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న సూపరింటెండెంట్ J. ప్రభాకర్ రెడ్డి సన్మాన కార్యక్రమం పరిపాలన భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రభాకర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆయన విశ్వవిద్యాలయానికి అందించిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది, ఔట్సోర్సింగ్ సిబ్బంది, ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన జీవిత ప్రయాణం ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు.