365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు 18,2022: ఇటీవల మార్కెట్ లో “ఆర్గానిక్ “పేరుతో భారీగా మోసం జరుగుతోంది. పురుగుమందు లు వేసి పండించిన కాయగూరలను సైతం ఆర్గానిక్ స్టిక్కర్లు వేసి అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. అసలు ఆర్గానిక్ పద్దతిలో పండించిన కూరగాయలను ఎలా గుర్తించాలి..?
ఈజీగా వాటిని గుర్తుబట్టలనుంటే ఏమేమి అంశాలను పరిగణలోకి తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం… మార్కెట్ లో కనిపించే కూరగాయలన్నీ సేంద్రియ పద్ధతిలో పండించినవి కాదు. అసలు అవి ఆర్గానిక్ విజిటబుల్స్ కాదనడానికి కొన్ని బండ గుర్తులులున్నాయి. అవేంటంటే..?
సేంద్రియ పద్దతిలో పండిన కూరగాయలు చూడగానే ఆకర్షణీయంగా ఉండవు. ఆర్గానిక్ విజిటబుల్స్ అవునా? కాదనడానికి ఈ ఒక్క బండ గుర్తును చూడాలి.. అంతేకాదు పెస్టిసైడ్స్ వేసి పండించినవైతే ఆయా కూరగాయలకు పురుగులు పట్టవు.. దీని ఆధారంగా సేంద్రియ కూరగాయలు అవునా..? కదా..? అని డిసైడ్ అవ్వొచ్చు.
రైతులు పండించిన కూరగాయలను కొంతమంది దళారులు రైతుబజార్లలోనూ సూపర్ మార్కెట్లలోనూ ఆర్గానిక్ స్టిక్కర్లతో అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటు న్నారు. ఈ కూరగాయలు తింటున్న వినియోగదారులు మోసపోవడమే కాకుండా వారిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి అడ్డుకట్టవేయాలంటే తప్పనిసరిగా ఒరిజినల్ ఆర్గానిక్ ఉత్పత్తులను గుర్తించగలగాలి.. ఆర్గానిక్ కూరగాయల లైఫ్ టైం చాలా తక్కువ. ఇవి కోసిన కొద్ది రోజుల్లోనే పాడైపోతాయి.

పాడవకుండా ఫ్రిజ్ లో పెట్టు కోవచ్చు. అదే పురుగుల మందులుతో పండించిన విజిటబుల్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ గుర్తులను బట్టి ఆర్గానిక్ పండ్లను గుర్తించడం వల్ల వాటిని సులువుగా కొనుగోలు చేసే వీలుంటుంది. తద్వారా ఎక్కువ ధరకు కెమికల్స్ వాడిన ఉత్పత్తులు కొనకుండా జాగ్రత్త పడవచ్చు. ఆర్గానిక్ ఫుడ్ మోసాలకు చెక్ పెట్టి, ఆరోగ్యకరమైన ఆహారం కొనుగోలు చేసి తినే వీలుకలుగుతుంది.
ఆర్గానిక్ కూరగాయలతో పోల్చితే రసాయన ఎరువులు వేసి పండించిన కూరగాయలు వాసనతోపాటు మంచి రుచి కలిగి ఉంటాయి. అంతే కాదు.. ఇలా పండించిన కూరగాయల్లో అనేక పోషకాలు కూడా ఉంటాయి.ఆర్గానిక్ విజిటబుల్స్ లో ఆయా కాయల్లో విత్తనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సొరకాయ, పొట్లకాయ, దోసకాయ, బెండకాయ, వంకాయ వంటివి చూస్తే సహజసిద్ధంగా పండించిన వాటిలో చాలా ఎక్కువగా గింజలు కనిపిస్తాయి.
పెద్ద సైజ్ లోని కాయలను చూసి చాలామంది బావున్నాయని భావించి వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతారు. కానీ కేవలం రసాయన ఎరువులను ఉపయోగించి పండించే కూరగాయలు మాత్రమేపెద్ద సైజ్ లో ఉంటాయి. ఆర్గానిక్ కూరగాయలు ఎరువులు ఉపయోగించకుండా పండిస్తారు. కాబట్టి వాటి సైజ్ చిన్నగా ఉంటాయి. అయితే హైబ్రిడ్వైతే ఆర్గానిక్ అయినా కాస్త పెద్ద సైజ్ లోనే ఉంటాయి.
ఆర్గానిక్ కూరగాయలను రసాయన ఎరువులు వేసిన వాటితో పోల్చుకుంటే రంగులో, షేప్ లో కాస్త తేడాగానే ఉంటాయి. అవి చూసేందుకు కూడా పెద్దగా ఆకట్టుకునే విధంగా ఉండవు. అలాగే సేంద్రియ కూరగాయలు ఏవైనా రెండు తీసుకుంటే వాటి పరిమాణంలో గానీ, ఆకారంలో గానీ ఖచ్చితంగా మార్పులు కనిపిస్తాయి. అంతేకాదు వాటి తోలు కూడా బరకగా ఉంటుంది.

చాలామంది కూరగాయల్లో ఎలాంటి పురుగులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. కానీ సహజంగా పెంచిన విజిటబుల్స్ కోసం ఎలాంటి ఎరువులు ఉపయోగించట్లేదు కాబట్టి వీటిలో పురుగులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఒకవేళ పురుగులు కనిపిస్తే వాటికి పురుగుల మందులు తక్కువగా ఉపయోగించారని గుర్తించాలి.. పురుగులున్నాయని భావిస్తే ఆ కూరగాయలను ఉప్పు వేసిన నీటిలో నానబెట్టి తర్వాత వండుకోవడం మంచిది. ఆర్గానిక్లో పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు మాత్రమే కాదు ప్రతి పంటను సేంద్రియ పద్ధతుల్లో పండించవచ్చు.
ఈ విధానంలో పశువుల పేడతోపాటు సహజ ఉత్పత్తులను మాత్రమే వాడతారు. దీని వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. భూమిలో సారం పెరుగుతుంది. భవిష్యత్ తరాలకు నాణ్యమైన వనరులను అందించగలుగుతాం. అన్నదాతలు కూడా క్షేమంగా ఉంటారు. సేంద్రియ వ్యవసాయాన్నిను ప్రోత్సహించడం వల్ల రైతులకు, వినియోగదారులకు ఎంతోమేలు జరుగుతుంది.