365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, ఏప్రిల్ 18, 2025: ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎయిర్ కండీషనర్ (ఏసీ) ఉపయోగం పెరిగింది. అయితే, ఏసీని సరైన రీతిలో ఉపయోగించకపోతే ఆరోగ్యం, జేబు రెండూ దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీని సమర్థవంతంగా, ఆరోగ్యకరంగా ఉపయోగించే విధానాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఏసీ ఉష్ణోగ్రత 26 డిగ్రీలకు వద్ద సెట్ చేయండి..
చాలామంది ఎసిని 20-22 డిగ్రీలకు సెట్ చేసి, చలిగా అనిపిస్తే దుప్పటి కప్పుకుంటారు. ఇది ఆరోగ్యానికి హానికరం. మానవ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. 23 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలను శరీరం సహజంగా తట్టుకుంటుంది.
ఇది కూడా చదవండి..పేదల కలలకు ఊపిరిపోస్తున్న ఉపాధి సౌరభం.. పీఎం ముద్రా యోజన..
Read this also…India’s First Successful Bilateral Ureteral Reconstruction via Laparoscopy Performed at Preeti Urology..
తక్కువ ఉష్ణోగ్రతల్లో (19-21 డిగ్రీలు) ఎసి నడిపితే, శరీరంలో హైపోథర్మియా ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది రక్త ప్రసరణను దెబ్బతీసి, కీళ్ల నొప్పులు, చర్మ సమస్యలు, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు, తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎసి నడిపితే కంప్రెసర్ నిరంతరం పనిచేసి, విద్యుత్ బిల్లు భారీగా పెరుగుతుంది.

సరైన ఉపయోగం ఎలా..?
- ఎసి ఉష్ణోగ్రతను 26 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువగా సెట్ చేయండి.
- ఫ్యాన్ను తక్కువ వేగంతో ఉపయోగించడం వల్ల గాలి ప్రసరణ మెరుగవుతుంది.
- 28 డిగ్రీలకు సెట్ చేస్తే ఆరోగ్యం, విద్యుత్ రెండూ ఆదా అవుతాయి. ప్రయోజనాలు ఏమిటి..?
- విద్యుత్ వినియోగం తగ్గి, బిల్లులు తగ్గుతాయి.
- శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
- విద్యుత్ ఆదా గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గృహం రాత్రికి 5 యూనిట్ల విద్యుత్ ఆదా చేస్తే, లక్షల గృహాలు ఈ పద్ధతిని అనుసరిస్తే రోజుకు కోట్లాది యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది.
ఇది కూడా చదవండి..యూరోపియన్ యూనియన్పై సుంకాలపై తొందరపడనని వెల్లడి.. ట్రంప్తో భేటీలో ఇటలీ ప్రధాని మెలోని..
ఏసీని 26 డిగ్రీలకు సెట్ చేయడం వల్ల ఆరోగ్యం, ఆర్థికం, పర్యావరణం మూడింటికీ మేలు జరుగుతుంది. ఈ సామాన్యమైన మార్పు పెద్ద స్థాయిలో విద్యుత్ ను పొదుపు చేస్తూ, ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడుతుంది.