Voter card-Aadhaar link

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 2,2022: తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సోమవారం తొలిరోజు ఆప్షన్‌ రోల్‌కు ఓటరు కార్డులను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసుకోవడానికి ఏర్పాటుచేసిన ఎన్రోల్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు.

Voter card-Aadhaar link

సుమారు 4,000 మంది ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఆధార్ కార్డును ఓటర్ కార్డుతో అనుసంధానం చేసుకున్నారని తెలిపారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్‌ఎస్‌ఆర్) ప్రీ-రివిజన్ కార్యకలాపాలు ఆగస్టు1 నుంచి ప్రారంభమ య్యాయని, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణకు గడువు తేదీ అయిన నవంబర్ 9వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు.

Voter card-Aadhaar link

అభ్యంతరాల పరిష్కారానికి డిసెంబర్ 26 వరకు వ్యవధి ఉంటుందని ఆయన చెప్పారు. ఓటరు జాబితా తుది ప్రచురణ జనవరి 5, 2023న చేయనున్నారు. ఓటర్ల నమోదు కోసం సవరించిన ఫారమ్‌లను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలలో సోమవారం లాంఛనంగా ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, మీడియా, NGOలు, CSO లకు తెలియజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఓటరు నమోదు కోసం కొత్త ఫారమ్‌లు ఓటర్లకు సులభంగా, అనువైనవిగా ఉన్నాయని ఆయన అన్నారు.

Voter card-Aadhaar link

ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్‌ను అనుసంధానం చేయడంపై సీఈఓ మాట్లాడుతూ ఆధార్ వివరాలను పంచుకోవడం స్వచ్ఛందంగా జరుగుతుందన్నారు. కసరత్తు సందర్భంగా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల ఆధార్ వివరాలను వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సమాచారం పొందేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.