Husband brutally murdered his wife

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కరీంనగర్,ఆగష్టు 16,2022:కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు.. ఓ భర్త. చిగురుమామిడి మండలం ఇందుర్తిలో సోమవారం అంగన్‌వాడీ కార్యకర్త కనకం శిరీష (30)ను భర్త కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్య చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అంగన్‌వాడీ అటెండర్‌గా పనిచేస్తున్న శిరీషకు ఆమె భర్త ప్రవీణ్‌తో కొంతకాలంగా వివాదం ఉంది. అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ప్రవీణ్ ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళి కత్తితో దాడికి పాల్పడ్డాడు.

Husband brutally murdered his wife

తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.భర్తతో విభేదించిన శిరీష ఇటీవల ప్రవీణ్‌కి విడాకుల నోటీసు పంపింది. ఈ ఘటనపై కోపోద్రిక్తుడైన ప్రవీణ్ శిరీషపై పగ పెంచుకుని ఆమెను హత్య చేశాడు.

అనంతరం ప్రవీణ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న తిమ్మాపూర్ సీఐ శశిదర్ రెడ్డి, ఎస్ ఐ దాసు సుధాకర్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.