365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 12,2025: నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు వరద ముప్పుకు గురైన పలు ప్రాంతాలను హైడ్రాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గురువారం స్వయంగా పరిశీలించారు. ఉదయం డోయన్స్ కాలనీ, లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాల్లో వరద నీటి నిల్వపై సమీక్ష నిర్వహించారు. ఎగువ నుంచి వచ్చే వరద గోపిచెరువుకు చేరే మార్గం లేకపోవడంతో శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం రోడ్డు వరద నీటిలో మునిగిపోయినట్లు స్థానికులు వివరించారు.
లింగంపల్లి అండర్పాస్లో వర్షం నీరు, చెరువుల నీరు కలిసి నిలిచిపోయిందని, గోపి చెరువు ,చాకలి చెరువుల్లో నీటిమట్టం తగ్గించితే వరద ముప్పు తగ్గుతుందని అధికారులు సూచించారు. ఆ తర్వాత కమిషనర్ కొండాపూర్లోని కాసోరోస్ అపార్ట్మెంట్ పరిసరాలను పరిశీలించి, మురుగు, వరద కాలువల పునరుద్ధరణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
బాచుపల్లిలో వేగవంతం అవుతున్న SNDP పనులు:
బాచుపల్లిలో కూడా వరద ముప్పు ఉన్న కాలువలను పరిశీలించిన కమిషనర్, SNDP పథకం కింద చేపట్టిన కాలువల పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. చెన్నం చెరువు నుంచి వచ్చే వరద నీరు రామచంద్రాపురం కాలనీలో నిలవకుండా నేరుగా బాచుపల్లి చెరువుకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

12 గంటల్లో 7 ఏళ్ల సమస్యకు పరిష్కారం
బుధవారం కమిషనర్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు రాజేంద్రనగర్ మండలంలోని ఉప్పరపల్లి, శాస్త్రిపురం, పల్లె చెరువు ప్రాంతాలను సందర్శించారు. ఉప్పరపల్లి అశోక్ విహార్ కాలనీలో మురుగు, వరద కాలువల లేమితో 400 కుటుంబాలు ఏడేళ్లుగా ఇబ్బందులు పడుతున్నాయని నివాసితులు వాపోయారు.
సమీపంలోని మూసినదికి 150 మీటర్ల దూరంలో ప్రధాన కాలువ ఉన్నప్పటికీ, భూ యజమానుల అనుమతి లేకపోవడంతో కాలువ నిర్మాణం ఆగిపోయిందని నివాసితులు తెలిపారు. దీంతో అపార్ట్మెంట్లలో మురుగు నీరు నిలిచిపోయిందని చూపించగా, కమిషనర్ వెంటనే స్పందించి-“కాలువ తవ్వించి సమస్య పరిష్కరిస్తాం” అని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి…ప్రపంచ చరిత్రలో మహో విషాదకర ఘటనలు: మానవాళిని కుదిపేసిన విపత్తులు
Read This also…world’s biggest Tragedies..
ఈ హామీ మేరకు గురువారం ఉదయం నిద్రలేచేలోపే కాలువ తవ్వించి సమస్యను పరిష్కరించారు. దీంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ —
“7 ఏళ్ల సమస్యకు 12 గంటల్లో పరిష్కారం చూపిన కమిషనర్కు ధన్యవాదాలు” అని అన్నారు.
ఇది కూడా చదవండి…అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలిన విమానం
Read This also…Signify Illuminates 78,000+ Lives in Andhra Pradesh through ‘Har Gaon Roshan’ CSR Initiative
పల్లె చెరువు ఔట్లెట్, పార్క్ ఆక్రమణపై కమిషనర్ సమీక్ష
మైలార్దేవుపల్లిలోని పల్లె చెరువు ఔట్లెట్ను కూడా కమిషనర్ పరిశీలించారు. గతంలో చెరువు కట్ట తెగి వాహనాలు కొట్టుకుపోయిన ఘటనను స్థానికులు గుర్తు చేశారు. ఔట్లెట్ను విస్తరించాలని కోరారు. అదే ప్రాంతంలోని శాస్త్రిపురం పార్క్ ఆక్రమణను చూసిన కమిషనర్, వివరాలు సేకరించి ఆక్రమణదారులతో చర్చించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

“బాలల ఆట స్థలాన్ని ప్రైవేట్ భూమిగా చెప్పి కబ్జా చేశారంటూ” స్థానిక మహిళల వాపోను గమనించిన కమిషనర్ —
“పార్క్ లే అవుట్ ప్రకారం పునరుద్ధరిస్తాం” అని హామీ ఇవ్వడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.