365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 8,2025: మచ్చబొల్లారంలోని శ్మశాన వాటిక సమీపంలో చెత్తను డంపింగ్ చేస్తున్న రాంకీ సంస్థపై స్థానికుల ఫిర్యాదులను అధికారాలు పరిగణనలోకి తీసుకున్నాయి. మండలంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మంగళవారం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
Read this also…CPawan Kalyan Orders Probe into JEE Students’ Delay Allegations
Read this also…Pawan Kalyan to Travel to Singapore After Son Injured in School Fire
తీవ్ర వేడి మధ్య స్థానికులు పెద్ద సంఖ్యలో కమిషనర్ పర్యటనలో పాల్గొన్నారు. శ్మశాన భూములతో పాటు, ప్రభుత్వ భూములు, చెత్త డంపింగ్ చేసే ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. చెత్త వల్ల పరిసరాలు దుర్గంధభరితంగా మారాయని, శ్మశాన ప్రాంతానికి దెబ్బతీస్తోందని స్థానికులు వాపోయారు.

ఈ విషయమై ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ తెలిపారు. మంత్రి శ్రీధర్బాబు కూడా ఈ సమస్యను గమనించి తక్షణ పరిష్కారానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తికి సూచనలు చేశారని రంగనాథ్ పేర్కొన్నారు.
Read this also…CIEU Think Tank Urges Affordable Cancer Treatment Through Wider Adoption of Biosimilars in India
Read this also…Jio Tops 5G Download Speeds in India, Says Ookla Report
ప్రస్తుతానికి నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేయాలని, చెత్త డంపింగ్ను తాత్కాలికంగా ఆపాలని సూచించారు. త్వరలోనే ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనుందని తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమించబడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రీన్ఫీల్డ్ భూములను కూడా కమిషనర్ పరిశీలించారు.