365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 6,2025: గచ్చిబౌలి ప్రధాన రహదారి పక్కన నిర్మించబడిన సంధ్యా కన్వెన్షన్ కేంద్రంపై హైడ్రా అధికారులు మంగళవారం ఉక్కుపాదం మోపారు. అనుమతులు లేకుండా నిర్మించారని ఆరోపణల నేపథ్యంలో ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ సభ్యుల ఫిర్యాదులపై చర్యలు చేపట్టారు.
అక్రమంగా నిర్మించిన మినీ హాల్, వంట గదులు, 10 రెస్టురెంటు గదులు, అలాగే జీ+2 స్థాయిలో నిర్మించిన రెండు భవనాలు కూల్చివేయబడ్డాయి. అంతేకాకుండా, లే ఔట్ చుట్టూ వేసిన compound wall, arch నిర్మాణాలనూ తొలగించారు. 1980లలో రూపొందించిన 162 ప్లాట్ల లే ఔట్ను కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమించారంటూ పలువురు ఫిర్యాదుదారులు ఆరోపించారు.
ReadThis also…Top 5 Family Cars with Big Boot Space for a Perfect Holiday Road Trip
ఇది కూడా చదవండి…“పంజాబ్ వేఖ్ కే” తో కోక్ స్టూడియో భారత్ కు హ్యాట్రిక్ విజయం
అక్రమాలపై ప్రజావాణిలో వినిపిస్తున్న స్వరాలు:
‘‘మేము కొన్న ప్లాట్లకు ఎటువంటి గుర్తింపు లేకుండా, రహదారులు, పార్కులు ఎరుక లేకుండా పూర్తిగా ఆక్రమించారు. మేము ప్రశ్నించగానే మాపై దాడులు చేశారు. మోసాలకు తాళలేక కొందరు ఆత్మహత్యలకూ పాల్పడ్డారు. శ్రీధర్రావుపై ఇప్పటికే 30కి పైగా కేసులు నమోదయ్యాయి,’’ అని బాధితులు వివరించారు.

విదేశాల నుంచి కూడా ఫిర్యాదులు:
హైడ్రా చర్యలతో ధైర్యం వచ్చిన పలువురు బాధితులు ఆన్లైన్, ఈమెయిల్, వీడియోల ద్వారా తమ గోడును వెల్లగక్కుతున్నారు. విదేశాల నుంచి ఓ మహిళ – తన భర్త, కొనుగోలు చేసిన ప్లాట్ను తిరస్కరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. త్వరలో హైదరాబాద్కి వచ్చి ప్రత్యక్షంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
ఇది కూడా చదవండి…సరికొత్తగా మెగాస్టార్ చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ- రిలీజ్.. రీల్ టు 3D ప్రింట్ కోసం ఎంతో శ్రమించిన చిత్రయూనిట్
ReadThis also…From Lost Reels to 3D Wonder: The Remarkable Restoration of Megastar Chiranjeevi’s Jagadeka Veerudu Athiloka Sundari
వేగంగా వెలుగులోకి వస్తున్న అక్రమాలు:
ఒకటి కాదు రెండు కాదు… ఫెర్టిలైజర్స్ సొసైటీ లే ఔట్తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ శ్రీధర్ రావు చేసిన భూమి ఆక్రమణలపై ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలపై కూడా హైడ్రాకు సమాచారం అందుతోంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు ఆక్రమణల తొలగింపుకు చర్యలు చేపట్టారు.