365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 7,2025:మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ భూములపై జరుగుతున్న ఆక్రమణలపై హైడ్రా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామ పరిధిలోని సర్వే నెం.354లో ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిని మంగళవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి…మహిళా సైనిక నాయకత్వంలో “ఆపరేషన్ సిందూర్” ..
ఇది కూడా చదవండి…గత ఎనిమిది సంవత్సరాలలో పాకిస్థాన్ దాడులు, భారత్ ప్రతిస్పందన..
ఈ భూమిలో కేఎల్ యూనివర్సిటీ చేసిన అయిదు ఎకరాల స్థలాన్ని కూడా తొలగించారు. 2009లో ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ స్వగృహ’ పథకం కోసం కేటాయించినప్పటికీ, నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో కొందరు స్థానిక రాజకీయ నాయకుల చేతిలో భూమి ఆక్రమితమైంది.

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు ఉండటాన్ని నిర్ధారించారు. అనంతరం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశాల మేరకు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి…ఆపరేషన్ సిందూర్ కు ముందు తర్వాత.. పాకిస్థాన్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు..
ఇది కూడా చదవండి…సంధ్యా కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలపై హైడ్రా అక్రమ నిర్మాణాల తొలగింపు – శ్రీధర్ రావుపై ఫిర్యాదుల వెల్లువ..
ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, “ప్రభుత్వ భూమి – హైడ్రా రక్షించిన భూమి” అనే బోర్డులు ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో కాటేదాన్లోని ఇందిరా సొసైటీ కాలనీలో కూడ రహదారులను ఆక్రమించిన నిర్మాణాలను కూల్చివేశారు. ప్లాట్లను కబ్జా చేసేందుకు కొందరు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టారు.