365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 10,2025: నాలా విస్తరణ పనులను వేగవంతం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో, ఈ నెలాఖరు నాటికి సాధ్యమైనంత వరకు పనులను పూర్తి చేయడంతో పాటు, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తే వరద ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని ఆయన అన్నారు.

బేగంపేటలోని ప్యాట్నీ నాలా విస్తరణ పనుల పురోగతిని కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్, హైడ్రా ఇరిగేషన్, ట్రాఫిక్ అధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. గతంలో, జూన్ 6న ఈ నాలాపై ఆక్రమణలను హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే.

Read This also…సంస్కృతి, సమైక్యత, మేళవింపుల కలయికగా… ‘ప్రేమతో.. జీ తెలుగు’!

Read This also…ZEE Telugu Invites Viewers to Celebrate Togetherness with ‘Prematho Zee Telugu’

ప్యాట్నీ నాలా వెడల్పును 20 మీటర్లకు విస్తరించడంతో పాటు, ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని కమిషనర్ నిర్ణయించారు. అలాగే, నాలా చుట్టూ 5 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని సూచించారు.

పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. స్థానికులు నాలా విస్తరణకు సహకరిస్తామని, దశాబ్దాలుగా వరద సమస్యతో బాధపడుతున్నామని, ఈ చర్యలతో ఈసారి వరద ముప్పు తప్పుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ కమిషనర్‌ను అభినందించారు.

చికోటీ గార్డెన్స్‌లో నాలా పునరుద్ధరణ
ప్రకాశ్‌నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో బేగంపేట విమానాశ్రయం నుంచి వచ్చే వరద నీటిని తీసుకెళ్లే కాలువ, సాధారణంగా 6 మీటర్ల వెడల్పు ఉండాల్సి ఉండగా, పలు చోట్ల 2 మీటర్ల కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

నందిని హోటల్ వద్ద ఈ కాలువ కేవలం 1.8 మీటర్లకే పరిమితమైంది. కూకట్‌పల్లి ప్రధాన కాలువతో కలిసే వరకు 2 కిలోమీటర్ల పొడవున్న ఈ నాలాలో, ఒక కిలోమీటరు మేర ఆక్రమణలు ఉన్నట్లు కమిషనర్ గమనించారు. ఈ నాలాను పునరుద్ధరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

స్థానికులు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు నాలా విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామని, ప్రతి ఏటా వరద సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, నాలాను 6 మీటర్లకు విస్తరిస్తే వరద నీరు సాఫీగా ప్రవహిస్తుందని తెలిపారు. వారు కమిషనర్‌కు వరద సమయంలోని వీడియోలను చూపించి సమస్య తీవ్రతను వివరించారు.

ఇది కూడా చదవండి…ఆయుష్ ఆర్ట్ అండ్ బులియన్ FY25లో ఆదాయం 1000% వృద్ధితో ఘన విజయం..

Read This also…Aayush Art and Bullion Ltd Reports Robust Growth in FY25 with Revenue Soaring 1000% to Rs 73.77 Crores

చింతలబస్తీలో నాలా పరిశీలన
శంకరపల్లిలోని బుల్కాపూర్, కొంపల్లి, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, షేక్‌పేట, మెహిదీపట్నం, బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12 మీదుగా చింతలబస్తీలోకి ప్రవేశించి హుస్సేన్‌సాగర్‌లో కలిసే బుల్కాపూర్ నాలాను కూడా కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు.

చింతలబస్తీలో పింఛను ఆఫీసు సమీపంలో నాలాను కబ్జా చేసి దుకాణాలు నిర్మించిన విషయాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. వరద ప్రవాహానికి అడ్డంకులు సృష్టించేలా ఇసుక, సిమెంట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.

అలాగే, నాలాను ఆక్రమించి కల్లు కాంపౌండ్ నిర్మించిన విషయాన్ని గమనించి, వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. నాలాలో వరద నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని, పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించాలని సూచించారు.