365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, సెప్టెంబర్ 12,2023:భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం కుదుపునకు లోనయ్యాయి. సూచీలు జీవితకాల గరిష్ఠాలకు చేరడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. ప్రాఫిట్ బుకింగ్ చేపట్టడంతో సూచీలు పతనమయ్యాయి. మధ్యాహ్నం తర్వాత కోలుకొని ఫ్లాట్గా ముగిశాయి. ఆసియా, గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగెటివ్ సిగ్నల్స్ రావడం ఇందుకు దోహదం చేసింది. http://dhunt.in/PeUKm

జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, చైనా స్టాక్ మార్కెట్లు వణికిపోయాయి. ఐరోపా మార్కెట్లూ ఇదే దోరణి అనుసరించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలపడి 83.03 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 3 పాయింట్లు తగ్గి 19,993, బీఎస్ఈ సెన్సెక్స్ 94 పాయింట్లు తగ్గి 67,221 వద్ద ముగిశాయి.
క్రితం సెషన్లో 67,127 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 67,506 వద్ద మొదలైంది. 66,948 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,539 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 94 పాయింట్ల లాభంతో 67,221 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 20,110 వద్ద మొదలై 19,914 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరింది. 20,110 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొని 19,993 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 45,511 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 50 అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 20:30గా నమోదైంది. టీసీఎస్ (2.64%), ఎల్టీ (1.88%), ఇన్ఫీ (1.66%), అల్ట్రాటెక్ సెమ్ (1.43%), డాక్టర్ రెడ్డీస్ (1.41%) టాప్ గెయినర్స్. బీపీసీఎల్ (3.79%), ఎన్టీపీసీ (3.60%), పవర్గ్రిడ్ (3.25%), అదానీ ఎంటర్ప్రైజైస్ (3.17%), కోల్ ఇండియా (3.08%) టాప్ లాసర్స్.

ఆటో, మీడియా, మెటల్, పీఎస్యూ బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొన్నాయి. మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఎరుపెక్కాయి.
నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీని ఐటీ రంగమే ఆదుకొంది. ఈ సూచీ 335 పాయింట్లు పెరిగి ఒక శాతం లాభంతో 32,977 వద్ద క్లోజైంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో షేర్లు లాభపడటంతో సూచీ పరుగులు పెట్టింది.
ఎల్టీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకూ మార్కెట్కు అండగా నిలిచాయి. సెప్టెంబర్ ఛార్ట్ను పరిశీలిస్తే నిఫ్టీకి 20,000 వద్ద సపోర్టు, 20020 వద్ద రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, దివిస్ ల్యాబ్, కొటక్ బ్యాంక్, సుందరమ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో షేర్లను కొనుగోలు చేయొచ్చు.
టీసీఎస్ షేర్లు నేడు 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. అదానీ పవర్, యాక్సిస్ బ్యాంక్, బర్జర్ పెయింట్స్, భారత్ ఫోర్జ్, దాల్మియా భారత్ వంటి షేర్లూ 52 వారాల గరిష్ఠాన్ని అందుకున్నాయి. స్పైస్ జెట్ రూ.100 కోట్లను కళానిధి మారన్కు చెల్లించింది. ఎన్ఎండీసీలో 12 లక్షల షేర్లు చేతులు మారాయి.

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 23.6 లక్షల షేర్లు చేతులు మారాయి. డీజిల్ వెహికల్స్ ప్రొడక్షన్ తగ్గించకుంటే మరో 10 శాతం జీఎస్టీ విధిస్తామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దాంతో ఎం అండ్ ఎం, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి వాహన కంపెనీల షేర్లు పతనమయ్యాయి. మైక్రో పీసీలు, కొత్త ల్యాప్ట్యాప్లు లాంచ్ చేయడంతో ఐటీఐ షేర్లు రెండు రోజుల్లోనే 36 శాతం పెరిగాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709..