365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఫిబ్రవరి 6,2023: ఈ క్యాటరింగ్ సేవల ద్వారా రైల్వే ప్రయాణికులు వాట్సాప్ సందేశం నుంచి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించింది ఇండియన్ రైల్వే. పిఎస్ యూ, ఐఆర్సిటిసి.
-వినియోగదారులకు పరస్పర సంభాషణ కోసం వాట్సాప్ నంబర్ +91-8750001323.
-AI పవర్ చాట్బాట్ ద్వారా ప్రయాణికులు అన్ని రకాల ఈ కేటరింగ్ సేవలను ఉపయోగించుకునేందుకు ఆర్డర్ చేయొచ్చు.
-ఎంపిక చేసిన రైళ్లు ప్రయాణీకులకు వాట్సాప్ నుంచి ఈ కేటరింగ్ సేవలు..
-వినియోగదారుల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా ఇతర రైళ్లలో కుడా దశల వారీగా అమలు చేయనుంది ఇండియన్ రైల్వే.
ఇండియన్ రైల్వేస్ పి ఎస్ యూ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. (ఐ ఆర్ సి టి సి) ప్రత్యేకంగా రూపొందించిన చేసిన వెబ్సైట్ www.catering.irctc.co.in ద్వారా ఫుడ్ ఆన్ ట్రాక్ కోసం ఈ -కేటరింగ్ యాప్ సేవలను ప్రారంభించింది.

వినియోగదారుకు ఈ -కేటరింగ్ సేవలను అందించడమే లక్ష్యంగా ఒక అడుగు ముందుకు వేసి, భారతీయ రైల్వే ఇటీవలే రైల్వే ప్రయాణికులకు ఈ -కేటరింగ్ విధానం ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ఈ వ్యాపార సేవల కోసం వాట్సాప్ నంబర్ +91-8750001323 ప్రారంభించారు .
వాట్సాప్ సంభాషణ ద్వారా ఈ కేటరింగ్ సేవలను రెండు దశల్లో అమలుపర్చడానికి ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో www.ecatering.irctc.co.in లింక్ను క్లిక్ చేయడం వల్ల వాట్సప్ నుంచి ఈ -కేటరింగ్ సేవలను ఎంచుకోవడానికి వినియోగదారులకు బుకింగ్ ఇ-టికెట్కు సందేశాన్ని పంపుతుంది.
ఈ ఎంపికతో వినియోగదారులు యాప్ను డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగాఐ ఆర్యొ సి టి సి వెబ్సైట్ ద్వారా స్టేషన్లలో అందుబాటులో ఉన్న తమకు నచ్చిన రెస్టారెంట్ల నుంచి తమకు నచ్చిన భోజనాన్ని బుక్ చేసుకోవచ్చు.
తదుపరి దశ సేవలలో, వాట్సాప్ నంబర్ ద్వారా AI పవర్ చాట్ నుంచి వినియోగదారులకు ఈ కేటరింగ్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసేందుకు అన్ని రకాల కేటరింగ్ సేవలకు సంబందించిన సందేహాలను నివృత్తి కోసం పరస్పర సంభాషణ చేసేందుకు వీలుకల్పిస్తుంది.

ఈ సేవలు మొదటగా ఎంపిక చేసిన రైళ్లు..
ప్రయాణీకులకు ఈ-కేటరింగ్ సేవల కోసం వాట్సాప్ సంభాషణ అమలు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచిసేవలకు సంబంధించి అభిప్రాయాలు , సూచనల ఆధారంగా ఇతర రైల్వేలో కూడా ఈ సేవలను ప్రారంభిస్తుంది.
ఐ ఆర్ సిటిసి వెబ్సైట్ నుంచి యాప్ ద్వారా ప్రారంబించిన రోజునే ఈ-కేటరింగ్ సేవల ద్వారా వినియోగదారులకు సుమారు 50,000 భోజనాలను అందించడం జరిగింది.