Sun. Sep 8th, 2024
space-tourism_365telugu

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ, ఫిబ్రవరి 8,2023: సబ్-ఆర్బిటల్ స్పేస్ టూరిజం మిషన్ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేసిన అధ్యయనం గురించి ప్రభుత్వం బుధవారం పార్లమెంటుకు తెలిపింది.

భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష విమానం గగన్‌యాన్ మిషన్ విజయవంతం అయిన తర్వాత దీనిని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

లోక్‌సభలో ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పేస్ టూరిజం కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం గురించి వివరించారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ఇస్రో స్పేస్ టూరిజం అవకాశాలపై అధ్యయనం చేసిందని ఆయన వెల్లడించారు.

space-tourism_365telugu

మానవులకు సురక్షితమైన అంతరిక్ష పర్యాటకం కోసం భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష కార్యక్రమం గగన్‌యాన్‌పై ఇస్రో పనిచేస్తోందని ఆయన అన్నారు.

గగన్‌యాన్‌ కార్యక్రమం ఉద్దేశం ఇదే..

భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి సంజయ్ కాకా పాటిల్ ,వైఎస్‌ఆర్‌సిపి ఎంపి గురుమూర్తి అడిగిన ప్రశ్నలకు జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ, తక్కువ భూమి కక్ష్యలో మానవ అంతరిక్షయాన సామర్థ్యాన్ని ప్రదర్శించడమే గగన్‌యాన్ కార్యక్రమం లక్ష్యంమని, గగన్‌యాన్ మిషన్‌ను సాధించిన తర్వాత భవిష్యత్ మిషన్‌లు ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు.

లిక్విడ్ ప్రొపెల్లెంట్ స్టేజ్ బూస్టర్‌పై సబ్-ఆర్బిటల్ స్పేస్ టూరిజం మిషన్ కోసం ఇస్రో కొన్ని సాధ్యాసాధ్యాల అధ్యయనాలు కూడా చేసిందని తెలిపారు. ఆస్ట్రోశాట్ డేటా ఫలితంగా 750కి పైగా వ్యాసాలు, 12 పీహెచ్‌డీ థీసిస్‌లు వెలువడ్డాయని జితేంద్ర సింగ్ చెప్పారు.

error: Content is protected !!