365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 30, 2025: రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ (తెలంగాణ,ఆంధ్రప్రదేశ్)లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. TRAI ఏప్రిల్ 2025కి విడుదల చేసిన నివేదిక ప్రకారం, జియో వైర్లెస్ మొబిలిటీ, వైర్లైన్ బ్రాడ్బ్యాండ్, 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA) విభాగాల్లో భారీ సబ్స్క్రైబర్ వృద్ధిని సాధించింది.
అత్యంత పోటీ ఉన్న మొబైల్ విభాగంలో జియో ఏప్రిల్ 2025లో అత్యధిక నెట్ సబ్స్క్రైబర్లను (95,310) జోడించింది. ఈ విధంగా జియో మొత్తం వినియోగదారుల సంఖ్యను మార్చి 2025లో 3,17,76,074 నుంచి ఏప్రిల్లో 3,18,71,384కి పెంచింది. భారతి ఎయిర్టెల్ 42,600 సబ్స్క్రైబర్లను జోడించగా, BSNL 1,715 మాత్రమే జోడించింది. ఇక వోడాఫోన్ ఐడియా 9,058 సబ్స్క్రైబర్లను కోల్పోయింది.
Read This also…Jio Dominates Subscriber Growth in Andhra Pradesh & Telangana
Read This also…India’s Reigning Beauties: A Look at the Nation’s Miss World Crown Holders..
జియో ఈ వృద్ధి ఈ ప్రాంతంలోని వినియోగదారుల వద్ద దాని స్థిరమైన ఆకర్షణను, పోటీ దారులను మించిన స్థాయిని ప్రతిబింబిస్తుంది.

జియో ఫైబర్ విస్తరణ శరవేగం
వైర్లైన్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో జియో ఫైబర్ ఏప్రిల్ 2025లో 54,000కి పైగా కొత్త సబ్స్క్రైబర్లను జోడించి మొత్తం సబ్స్క్రైబర్ సంఖ్యను 1.66 మిలియన్లకు చేర్చింది. భారతి ఎయిర్టెల్ 18,000 సబ్స్క్రైబర్లను జోడించగా, BSNL వృద్ధి స్వల్పంగా ఉంది. విస్తృత ఫైబర్ నెట్వర్క్, సులభమైన ప్లాన్లు, ఉత్తమ సేవా నాణ్యతలతో జియో ఫైబర్ పట్టణ ,సెమీ-పట్టణ ప్రాంతాలలో ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో దృఢంగా నిలుస్తోంది.
జియో ఎయిర్ఫైబర్ 5G విభాగంలో లీడర్
5G FWA విభాగంలో జియో ఎయిర్ఫైబర్ 80% పైగా మార్కెట్ వాటాతో తెలుగు రాష్ట్రాల్లో స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపిస్తోంది. జియో ఎయిర్ఫైబర్ సబ్స్క్రైబర్ బేస్ జాతీయ స్థాయిలో 6.14 మిలియన్లను దాటగా, AP సర్కిల్లో అది జనవరి 2025లో 4.27 లక్షల నుండి ఏప్రిల్లో 5.23 లక్షలకు పెరిగింది. ఈ విజయానికి వేగవంతమైన 5G రోల్అవుట్, సరసమైన ధరలు, అలాగే దుర్భర ప్రాంతాల్లో ఫైబర్ లేని చోట్ల కూడా హై-స్పీడ్ కనెక్టివిటీ అందించడం కారణమని చెప్పాలి.
ఇది కూడా చదవండి…భారతదేశ కీర్తి కిరీటంలో మెరిసిన విశ్వ సుందరీమణులు.. వీరే..!
ఇది కూడా చదవండి…గద్దర్ అవార్డులు 2024 ప్రకటించిన జయసుధ: ‘కల్కి’ ఉత్తమ చిత్రం, అల్లు అర్జున్ ఉత్తమ నటుడు
జియో యొక్క ఈ అద్భుత ప్రదర్శన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డిజిటల్ ప్రగతికి దారితీస్తోంది. జియో ఫైబర్, ఎయిర్ఫైబర్, వైర్లెస్ నెట్వర్క్ల ద్వారా హై-స్పీడ్, నమ్మదగిన, సులభంగా అందుబాటులో ఉన్న సేవలను అందిస్తూ, జియో ఈ ప్రాంతంలో డిజిటల్ మార్పును సాధిస్తున్నది.